Weather: తీవ్ర తుఫానుగా మోచా.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు ఉదయం 5:30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కొంత సేపటికి వాయువ్య దిశగా పయనించి ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించి క్రమంగా బలపడి ఇవాల సాయంత్రానికి తుపానుగా మారుతుందని వెల్లడించింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్నదని, ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. రేపు (12వ తేదీ) ఉదయం మళ్లీ క్రమంగా బలపడి, ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశను మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి 14వ తేదీ మధ్యాహ్నం 110-120 వేగంతో కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), క్యుక్ప్యూ (మయన్మార్) వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
ఇది తెలంగాణపై ప్రభావం
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
దీని ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రేపటి నుంచి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. నేటి నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, రాష్ట్రంలోని కొన్ని చోట్ల దాదాపు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్లో ఇలా
“ఆకాశం నిర్మలంగా ఉంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు మరియు 28 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుండి గాలులు గంటకు 4 నుండి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ బులెటిన్ పేర్కొంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 36.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 61 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. రానున్న మూడు రోజుల పాటు రాయలసీమలో కూడా పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి రెండు చోట్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్.. నిందుతుల పాస్పోర్ట్ సీజ్
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!