Weather: తీవ్ర తుఫానుగా మోచా.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్
Weather: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు ఉదయం 5:30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కొంత సేపటికి వాయువ్య దిశగా పయనించి ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించి క్రమంగా బలపడి ఇవాల సాయంత్రానికి తుపానుగా మారుతుందని వెల్లడించింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్నదని, ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. రేపు (12వ తేదీ) ఉదయం మళ్లీ క్రమంగా బలపడి, ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశను మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి 14వ తేదీ మధ్యాహ్నం 110-120 వేగంతో కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), క్యుక్ప్యూ (మయన్మార్) వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
ఇది తెలంగాణపై ప్రభావం
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
దీని ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రేపటి నుంచి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. నేటి నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, రాష్ట్రంలోని కొన్ని చోట్ల దాదాపు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్లో ఇలా
“ఆకాశం నిర్మలంగా ఉంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు మరియు 28 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుండి గాలులు గంటకు 4 నుండి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ బులెటిన్ పేర్కొంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 36.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 61 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. రానున్న మూడు రోజుల పాటు రాయలసీమలో కూడా పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి రెండు చోట్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్.. నిందుతుల పాస్పోర్ట్ సీజ్
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!