Weather: తీవ్ర తుఫానుగా మోచా.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు ఉదయం 5:30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కొంత సేపటికి వాయువ్య దిశగా పయనించి ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించి క్రమంగా బలపడి ఇవాల సాయంత్రానికి తుపానుగా మారుతుందని వెల్లడించింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్నదని, ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. రేపు (12వ తేదీ) ఉదయం మళ్లీ క్రమంగా బలపడి, ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశను మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి 14వ తేదీ మధ్యాహ్నం 110-120 వేగంతో కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), క్యుక్ప్యూ (మయన్మార్) వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
ఇది తెలంగాణపై ప్రభావం
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
దీని ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రేపటి నుంచి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. నేటి నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, రాష్ట్రంలోని కొన్ని చోట్ల దాదాపు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్లో ఇలా
“ఆకాశం నిర్మలంగా ఉంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు మరియు 28 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుండి గాలులు గంటకు 4 నుండి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ బులెటిన్ పేర్కొంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 36.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 61 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. రానున్న మూడు రోజుల పాటు రాయలసీమలో కూడా పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి రెండు చోట్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్.. నిందుతుల పాస్పోర్ట్ సీజ్
తాజావార్తలు
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!