MLC Kavitha: రాముడ్ని బీజేపీ వాడుకుంటోందంటూ కవిత కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha Counters On BJP: అధికారంలో ఉన్నంత మాత్రాన టీఆర్ఎస్ ప్రజలకు దూరమయ్యే పార్టీ కాదని.. అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కొంతమంది ప్రజలను విడగొట్టి, రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, మతం పేరు చెప్పి ఆగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు. జై శ్రీరామ్ అని బిజెపి అంటే.. మనమంతా జై జై శ్రీరామ్ అందామని పిలుపునిచ్చారు. అయినా.. అసలు విషయం అది కాదని, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలని అడిగారు. ఉద్యోగాల నోటిఫిషన్లు కోసం ఎంపి అరవింద్ను నిలదీయాలన్నారు. ధాన్యం కొనుగోలుకు లిమిట్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేసిందని, అది గ్రహించిన సీఎం కేసీఆర్ ఎత్తేశారని అన్నారు. ఎన్నికల కోసం బీజేపీ రాముడిని వాడుకుంటోందని, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఆ పార్టీ ‘జై శ్రీరాం’ అంటోందని కవిత ఎద్దేవా చేశారు. ఇక బతుకమ్మ సంబరాల్ని ఈ తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుకుందామని చెప్పారు.
అంతకుముందు.. బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. జెన్నారం జెడ్పీటీసీ ఎర్రశేఖర్ బృందం రూపొందించిన ‘సిరిమల్లెలో రామ రఘుమల్లెలో’ అనే గీతాన్ని.. రాష్ట్ర హోంశాఖమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆమె ఆవిష్కరించారు. అలాగే శుక్రవారం ఉదయం తెలంగాణ జాగృతి-యూకే విభాగం ఆధ్వర్యంలో జరగనున్న బతుకమ్మ వేడుకల పోస్టర్ను సైతం కవిత ఆవిష్కరించారు. అక్టోబర్ 2న యూకేలోని ఇల్ఫోర్డ్ నగరంలో బతుకమ్మ సంబరాల్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా.. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు చేనేత చీరలు అందించాలని నిర్ణయించిన తెలంగాణ జాగృతి – యూకే విభాగాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, జాగృతి ఉపాధ్యక్షుడు, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి యుకే అధ్యక్షుడు బల్మూరి సుమన్ రావ్, సాయి కృష్ణారెడ్డి, పత్తి రెడ్డి, ప్రశాంత్ పూస, శ్రావణి బాల్మూరి, మానసా రెడ్డి, సాగరికా పూస, రోహిత్ రావు పాల్గొన్నారు.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!