Kalvakuntla Kavitha: రాముడి పేరుతో బీజేపీ రౌడీయిజం చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kalvakuntla Kavitha Fires On BJP And ED Raids: కేంద్రంలో ఉన్న బీజేపీపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాముని పేరు చెప్పి బీజేపీ రౌడీయిజం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులపై నెల రోజులుగా ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని.. అయితే ఈ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని నాగిరెడ్డిపేటలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లీగల్గా వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ, బీజేపీ తెలంగాణలో ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోందని పేర్కొన్నారు. ఒక్క మంత్రిని గానీ, ఎమ్మెల్యేను గానీ, ఎంపీని గానీ విడిచిపెట్టడం లేదన్నారు. తమ అధికారులు సమాధానాలు చెప్తారని, తెలంగాణ వాళ్లు భయపడేవాళ్లు కాదని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కొందరు ప్రయత్నించారని, అడ్డంగా దొరికిన ఆ దొంగల్ని విచారణ చేయకుండా పిటిషన్లు వేశారని, కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాము వెనక్కు తగ్గకుండా సుప్రీంకోర్టుకి వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నామన్నారు. బండి సంజయ్ యాదగిరిగుట్ట వెళ్లి దొంగ ప్రమాణాలు చేశారంటూ విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ పేరు బయటకొచ్చిందని.. విచారణకు రమ్మంటే ఆయన పారిపోయాడంటూ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు చెప్పినా విచారణకు రావడం లేదని, కోర్టుల్లో పిటిషన్లు వేసి విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. బండి సంజయ్ నిన్న సభ పెట్టి ఏడ్చారని, తప్పు చేయనప్పుడు భయమెందుకు? అని నిలదీశారు. తమ నాయకులంతా మంచోళ్లేనని చెప్పే బండి సంజయ్.. బీఎల్ సంజయ్ని అరెస్ట్ చేయొద్దని కోర్టుకు ఎందుకు వెళ్లాడు? అని ప్రశ్నించారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
టీఆర్ఎస్ మంత్రులు ఐటీ, ఈడీ, సీబీఐ.. ఇలా ఎవరు పిలిచినా వెళ్తున్నారని, తప్పు చేయలేదు కాబట్టి భయం లేకుండా వాళ్లు విచారణకు హాజరవుతున్నారని కవిత చెప్పారు. మరి.. వాళ్లెందుకు భయపడుతున్నారు? విచారణకు ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. రాజకీయంగా గట్టిగా ఉన్న పార్టీని దెబ్బ కొట్టాలని, ఎదిగి వచ్చిన నాయకులను గద్దల మాదిరి వచ్చి ఎత్తుకుపోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి రౌడీయిజం చేయడం తప్ప మరో ఆలోచన లేదని, తాము ఈడీ దాడులకు ఏమాత్రం భయపడమని కవిత వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!