Sandra Venkata Veeraiah : పేదరికమే గీటు రాయిగా లబ్దిదారుల ఎంపిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి దళితబంధు పథకాన్ని నేడు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం భారతదేశంలోనే బ్యాంక్ గ్యారెంటీ లేకుండా, ఎవరి షూరిటీ లేకుండా నేరుగా 10లక్షల రూపాయలు ఏకౌంట్ లో వేసే గొప్ప కార్యక్రమమన్నారు. తొలి ఏకాదశి, బక్రీద్ సందర్భంగా ఈ దళిత బంధు యూనిట్లను ప్రారంభించటం సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. మిగిలిన దళితులకు కూడా పూర్తిగా దళిత బంధు పథకం అందుతుందని స్పష్టం చేశారు సండ్ర. మరొక 1500 యూనిట్లు మన నియోజకవర్గానికి మాంజూరు అయ్యాయని, దళిత బంధు స్ఫూర్తి ని దెబ్బతీయకుండా ప్రభుత్వ అధికారులకు అప్పగించి పేదరికమే గీటు రాయిగా లబ్దిదారులని ఎంపిక చేయటం జరిగిందని ఆయన వెల్లడించారు. ఏ పథకం పెట్టినా అందరికి ఒకే సారి లబ్ది చేకూర్చలేము. అలాగే దళిత బంధు కూడా అందరికి చేకూరుతుంది కానీ ఒకే సారి అంటే సాధ్యపడే కార్యక్రమం కాదని ఆయన వివరించారు.
CI Nageshwar Rao : రాచకొండ పోలీసులను బురిడీ కొట్టిన నాగేశ్వర్ రావు
Also Read
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
ఒకసారి లబ్ది పొందిన లబ్ధిదారుడు ఆర్ధికంగా నిలదొక్కుకొని మళ్లీ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా ఎదగాలి అని కోరుకుంటున్నానన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం ఎస్సీలకు మాత్రమే కేటాయించిన కల్యాణ లక్ష్మి పథకం తర్వాత బీసీలకు తర్వాత మైనారిటీలకు ఆ తర్వాత పేదరికమే గీటురాయిగా ఏదిగి కులంతో సంబంధం లేకుండా అందరికి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమన్నారు. రేపు దళిత బంధు కూడా అందరికీ అందుతుందని ఆశిస్తున్నామన్నారు. సొంత స్థలాలలో ఇల్లు కట్టుకోవాలి అని అందరు కోరుకుంటున్నారు. దానికి విధి విధానాల రూపాకల్పన జరుగుతుంది. అలాగే 57సంవత్సరాలకే ఫింక్షన్ కు సంబందించి కూడా రూపాకల్పన జరుగుతుంది.ఇవి రెండు పూర్తి అయితే కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో పూర్తి అవుతాయి. ఆగస్టు 15 నుండి కొత్త లబ్ది దారులకు కొత్త పింఛన్ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. విద్య వైద్యం పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దవఖానాలు అభివృద్ది, మైనారిటీ పాఠశాలలు, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పాఠశాలలు నిర్మించటం, గ్రామస్థాయిలో మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల అభివృద్ది చేపట్టిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ఆయన కొనియాడారు.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!