Raja Singh: నకిలీ సర్టిఫికెట్ల వెనుక MIM కుట్ర ఉంది.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh Claims That MIM Party Behind Fake Certificates: జీహెచ్ఎంసీలో వెలుగు చూసిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల జారీ వెనుక ఎంఐఎం పార్టీ కుట్ర దాగి ఉందని ఆరోపణలు చేసిన ఆయన.. దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ సిటీలోనే ఎక్కువగా బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయని.. ఇందులో టెర్రరిస్టులు కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీకి ముందు నుంచే నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయడం అలవాటు ఉందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ కోసమే ఈ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని ఆరోపించారు. తాము తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లమేనని, తామూ బారతీయులమేనని నిరూపించుకోవడం కోసం.. నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నారని అన్నారు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా సరికొత్త సంచలనం.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
తాను విడుదల చేసిన వీడియోలో రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్లో 27 వేల బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి? మున్సిపల్ అధికారుల సంతకం గానీ, స్టాంప్ గానీ లేకుండా ఒక్క బర్త్ సర్టిఫికెట్ కూడా తయారవ్వదు. అలాంటిది.. 27 వేల నకిలీ బర్త్ సర్టిఫికేట్లు ఓల్డ్ సిటీలో వెలుగు చూశాయంటే, కచ్ఛితంగా దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెనుక ఎంఐఎం పార్టీ వాళ్లు ఉన్నారు. వాళ్లు అక్రమంగా ఈ బర్త్ సర్టిఫికెట్లు తయారు చేయించారు. ఇందులో ఎంతోమంది పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు ఉన్నారు. ఇంకా ఎంతమంది ఈ హైదరాబాద్ నగరాన్ని టెర్రిరిస్ట్ అడ్డాగా మార్చుకున్నారో తేలాలి. ఈ కుట్రపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. కేవలం ఈ 27 వేల నకిలీ సర్టిఫికేట్లే కాదు.. ఇంకా ఎన్నో అక్రమ రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు ఉన్నాయి. వీటన్నింటిపై సీబీఐ విచారణ చేయాలని నేను కోరుతున్నాను’’ అంటూ పేర్కొన్నారు.
Sri chaitanya college: సాత్విక్ ఆత్మహత్య.. శ్రీచైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు
ఇదిలావుండగా.. సరైన పత్రాలు లేకుండానే 31 వేల బర్త్ & డెత్ సర్టిఫికేట్లను జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఓహెచ్, ఏఎంసీఏ, ప్రధాన కార్యాలయంలోని ముఖ్య అధికారులు.. ఈ నకిలీ సర్టిఫికెట్లను జారీ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. 2020 మార్చి నుంచి డిసెంబర్ 2022 వరకు.. నాన్ అవెలెబిలిటీ కింద 27,328 బర్త్ సర్టిఫికెట్లు, మరో 4,126 డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు వెల్లడైంది. ఇందులో అత్యధికంగా మెహదీపట్నం (5877), చార్మినార్ (3949), బేగంపేట్ (2821), సికింద్రాబాద్ (1758) ప్రాంతాల్లో నకిలీ బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు తేలింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Kishan Reddy:రూ.200 మందులు కొని రూ.21 ఫోన్ పే చేసిన కేంద్రమంత్రి
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!