Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చింది.. కానీ నేను వెళ్ళను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చిందని కానీ వెళ్లడం లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30వ తేదీన నియోజకవర్గంలో పనులు ఉన్నాయని కావున సచివాలయం ప్రారంభానికి వెళ్లలేనని తెలిపారు. తప్పు చేసిన మంత్రులను సీఎం కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. సీనియర్ మంత్రిపై ఆరోపణలు వస్థే ఎందుకు తొలగించడం లేదని మండిపడ్డారు. ఆ రోజు దారిన పోయే దానయ్య లు ఫిర్యాదు చేస్తే బిసి బిడ్డని మంత్రి వర్గం నుంచి తొలగించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు బాధ్యతగల ఎమ్మెల్యే గా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోరా ? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు దళిత బంధు కమిషన్ తీసుకున్నారని చిట్టా ఉందని సీఎం కేసీఆర్ అంటున్నారని తెలిపారు. దళిత బంధు కమీషన్ తీసుకున్న ఎమ్మెల్యే ల పై దర్యాప్తు చేయిస్తారా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ACB… DG సుమోటోగా తీసుకొని కేసు దర్యాప్తు చేస్తారా ? అని ప్రశ్నించారు.
Read also: మీకు బట్టతల ఉందా? అయితే ఈ గింజలు వాడండి
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
డబుల్ బెడ్ రూంలో అవినీతి, దళిత బంధులో అవినీతి, మిషన్ భగీరథలో అవినీతి జరుగుతుందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక్కడ అవినీతి సొమ్ముతో పక్క రాష్ట్ర పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి పై ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదు? అని ప్రశ్నించారు. బీసీలకు ఒక న్యాయం, దళితులకు మరో న్యాయమా? అగ్రవర్ణ మంత్రికి ఇంకో న్యాయమా ? అని ప్రశ్నించారు. దళిత బందులో ఎమ్మేల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తులు సుమొటోగా తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు. ఏసీబీ డీజీ కి… సీఎం కేసీఆర్ ఆ అవినీతి చిట్టా పంపించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చిందని అన్నారు. 30వ తేదీన నియోజకవర్గంలో పనులు ఉన్నాయని తెలిపారు. సచివాలయం ప్రారంభానికి నేను వెళ్ళడం లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి వస్తే మే ఒకటిన మొదటి దరఖాస్తు తీసుకొని నేనే వెళ్తా.. సీఎం కు ఇస్తా అని తెలిపారు.
Bonduc Nut: ఈ మొక్క మగవారికి దేవుడు ఇచ్చిన వరం
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!