Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చింది.. కానీ నేను వెళ్ళను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao: సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చిందని కానీ వెళ్లడం లేదని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 30వ తేదీన నియోజకవర్గంలో పనులు ఉన్నాయని కావున సచివాలయం ప్రారంభానికి వెళ్లలేనని తెలిపారు. తప్పు చేసిన మంత్రులను సీఎం కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. సీనియర్ మంత్రిపై ఆరోపణలు వస్థే ఎందుకు తొలగించడం లేదని మండిపడ్డారు. ఆ రోజు దారిన పోయే దానయ్య లు ఫిర్యాదు చేస్తే బిసి బిడ్డని మంత్రి వర్గం నుంచి తొలగించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ రోజు బాధ్యతగల ఎమ్మెల్యే గా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోరా ? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు దళిత బంధు కమిషన్ తీసుకున్నారని చిట్టా ఉందని సీఎం కేసీఆర్ అంటున్నారని తెలిపారు. దళిత బంధు కమీషన్ తీసుకున్న ఎమ్మెల్యే ల పై దర్యాప్తు చేయిస్తారా ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ACB… DG సుమోటోగా తీసుకొని కేసు దర్యాప్తు చేస్తారా ? అని ప్రశ్నించారు.
Read also: మీకు బట్టతల ఉందా? అయితే ఈ గింజలు వాడండి
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
డబుల్ బెడ్ రూంలో అవినీతి, దళిత బంధులో అవినీతి, మిషన్ భగీరథలో అవినీతి జరుగుతుందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక్కడ అవినీతి సొమ్ముతో పక్క రాష్ట్ర పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి పై ఆరోపణలపై ఎందుకు విచారణ చేయడం లేదు? అని ప్రశ్నించారు. బీసీలకు ఒక న్యాయం, దళితులకు మరో న్యాయమా? అగ్రవర్ణ మంత్రికి ఇంకో న్యాయమా ? అని ప్రశ్నించారు. దళిత బందులో ఎమ్మేల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తులు సుమొటోగా తీసుకొని విచారించాలని డిమాండ్ చేశారు. ఏసీబీ డీజీ కి… సీఎం కేసీఆర్ ఆ అవినీతి చిట్టా పంపించాలని కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ప్రారంభానికి ఆహ్వానం వచ్చిందని అన్నారు. 30వ తేదీన నియోజకవర్గంలో పనులు ఉన్నాయని తెలిపారు. సచివాలయం ప్రారంభానికి నేను వెళ్ళడం లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సచివాలయానికి వస్తే మే ఒకటిన మొదటి దరఖాస్తు తీసుకొని నేనే వెళ్తా.. సీఎం కు ఇస్తా అని తెలిపారు.
Bonduc Nut: ఈ మొక్క మగవారికి దేవుడు ఇచ్చిన వరం
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!