MLA Lakshmareddy: గల్లి గల్లిలో లక్ష్మారెడ్డి ప్రచారం.. బొట్టు పెట్టి మహిళలు హారతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Lakshmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో బీఆర్ఎస్ అభ్యర్థి జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను ఆరా తీశారు. తాగునీళ్లు సక్రమంగా అందుతున్నాయా కరెంటు ఇబ్బంది ఏమైనా ఉందా? రోడ్లు డ్రైనేజీ వసతి ఎలా ఉంది? అని ఇంటింటికి తిరుగుతూ అడిగి తెలుసుకున్నారు.

Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
అవ్వను, తాతలను ఆడబిడ్డలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం కొనసాగించారు. గల్లి గల్లిలో లక్ష్మారెడ్డికి బొట్టు పెట్టి మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో చేపట్టే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పథకాల గురించి వివరించారు. సౌభాగ్యలక్ష్మీ పథకం కింద గృహిణులకు నెలకు మూడు వేల రూపాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఇంతటి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న కేసీఆర్ సర్కార్ కి మద్దతు తెలుపాలని కోరారు. రేపు నవంబర్ 30వ తేదినా జరుగబోయే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని లక్ష మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు.

Lakshma Reddy
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల్లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుంటు ముందుకు సాగుతున్నారు. నిన్న మాదారం గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్థానిక మండల నాయకులతో కలిసి పర్యటించారు. తొమ్మిదిన్నర ఏళ్లలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ కేటాయిస్తూ, ప్రతిరోజు చెత్తను సేకరిస్తూ, డ్రైనేజీలు సిసి రోడ్లు ఏర్పాటు చేసి గ్రామాల రూపు రేఖలు మార్చామని తెలిపారు.

పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటుచేసి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాలను కాపాడుకుంటున్నామని తెలిపారు. కనీసం 7 గంటల కరెంటు కూడా సక్రమంగా సరఫరా చేయకుండా అన్నదాతలను ఆగం చేసిన గత ప్రభుత్వాలు కావాలా? నిరంతరంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందజేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కావాలా? అని రైతులు ఒక్క క్షణం ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు.
Balayya: బిగ్ బాస్ సీజన్ 8కి నట సింహం హోస్టింగ్?
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?