Jagga Reddy: ఢిల్లీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. రేపు రాహుల్తో భేటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలసిందే. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే సభల్లో ఎక్కడా కనిపించడం లేదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గ రాజకీయాలకే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో జగ్గారెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలని పిలుపు నిచ్చారు. దీంతో జగ్గారెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ వెళ్లారు. రేపు ఢిల్లీలో టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఇందుకోసం 21 మంది తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీలో జరిగే టీపీసీసీ సమీక్షా సమావేశంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే కూడా పాల్గొంటారని తెలుస్తోంది.
మరికొద్ది నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీలో చేరిక, నేతల మధ్య సమన్వయం, టిక్కెట్ల పంపిణీ, పార్టీ బలోపేతంపై రాహుల్ పలు సూచనలు చేయనున్నారు. ఈ మధ్యాహ్నం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. వీరిద్దరూ ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా.. వారితో పాటు రేవంత్ రెడ్డి కూడా వెళ్లారు. ఆ ఇద్దరు నేతలను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ వద్దకు తీసుకెళ్లనున్నారు. కాగా.. రాహుల్ గాంధీతో భేటీ తర్వాత పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్లో ఎప్పుడు చేరుతారనే దానిపై క్లారిటీ రానుంది. వీరితో పాటు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు చేతులు కలపనున్నారు.
Also Read
- KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
- Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని పొంగులేటి భావిస్తున్నారు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరే ఆలోచనలో జూపల్లి ఉన్నారు. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీని ఆహ్వానించాలని చూస్తున్నారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఇద్దరూ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చేరిక, బహిరంగ సభల తేదీపై పూర్తి క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. అసంతృప్త కాంగ్రెస్ నేతలను శాంతింపజేసి మళ్లీ క్రియాశీలకంగా మార్చేందుకు ఢిల్లీ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే జగ్గారెడ్డి వంటి పలువురు నేతలను కూడా సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
BJP MP: బీజేపీ రాజ్యసభ ఎంపీ హరద్వార్ దూబే మృతి
తాజావార్తలు
-
Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
-
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!