బోదాన్ పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం సంతోషకరం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడున్నర ఏళ్లలోనే రామప్పకు- పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉంది. నిజాం ప్రభుత్వంలో అగ్గిపెట్టలో చీరను నేచిన ఘనత బోధాన్ పోచంపల్లిది. మేము చేసే ప్రయత్నాలకు ఫలితాలు వస్తే ముందుగా గుర్తింపు ఇండియాకు వస్తది. త్వరలోనే బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు రాబోతోంది. ఇక అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.
ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కోలా సవతి తల్లి ప్రేమ చూపకుండా కేంద్రం నిధులు విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు శ్రీనివాస్ గౌడ్.. ఒకప్పుడు ప్రపంచంలోనే ధనిక దేశంగా ఈ ప్రాంతం ఉంది. ఆ మూలాలు ఇంకా పోలేదు. రామప్ప అభివృద్ధికి 300కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. బోధాన్ పోచంపల్లి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతున్నా. త్వరలోనే కిషన్ రెడ్డి ని కలిసి తెలంగాణ అభివృద్ధికి సహకారం ఇవ్వాలని కొరుతాం అని తెలిపారు.