Minister Seethakka: రైతు రుణ మాఫీ ఏక కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ దే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: రైతు రుణ మాఫీ ఏక కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ దే అని మంత్రి సీతక్క అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కొమురం భీం జిల్లాలో ఆమె మాట్లాడుతూ పీఎం మోడీపై మండిపడ్డారు. మోడీ వచ్చి అబద్ధాలు.. చెబుతున్నారని తెలిపారు. వాళ్ళు పదేళ్లు అధికారంలో ఉండి ప్రజా సమస్యలు పట్టించుకో లేదన్నారు. బీజేపి, బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసం హిందూ ముస్లిం కొట్లాటలు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం రక్షించ బడాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు. రైతు రుణ మాఫీ ఏక కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. అయోధ్య గురించి మాట్లాడే మోడీ రాజ్యాంగం పై ఎందుకు వివక్ష? అని ప్రశ్నించారు.
Read also: Zero Shadow day: ఈరోజు హైదరాబాద్ లో జీరో షాడో డే.. ఎన్నిగంటలకో తెలుసా..?
Also Read
- Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
- Bandi Sanjay : యోగితో బండి సంజయ్ భేటీ.. తెలంగాణపై కీలక చర్చ.!
- Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న ఈ ప్రాంతానికి ఏం చేయలేదని నష్టమే చేసింది కానీ ఏమి చేయలేదని నిన్న నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో జరిగిన సమావేశంలో అన్నారు. ఈ ప్రాంతానికి కేంద్ర విశ్వవిద్యాలయం ఇస్తామని ఇవ్వలేదు ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. తెరిపిస్తామన్న సిమెంట్ ఫ్యాక్టరీని ఇప్పటికీ తెరిపించలేదని తెలిపారు. రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మార్చేసి బడుగు బలహీన వర్గాల పేదలను మరింత పేదలుగా మార్చే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకే మోడీ సపోర్ట్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడక్కడ కొందరు మిల్లర్ల యాజమాన్యాలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని, అలా ఓవరాక్షన్ చేయకూడదని ఏమున్న కొనుగోలు కేంద్రం దగ్గరనే మాట్లాడి కానీ లారీలలో ధాన్యం రైస్ మిల్లర్ దగ్గరికి తీసుకెళ్లి కటింగ్ చేస్తున్నారని మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ ఆదేశించారని అన్నారు. ఈ ఆకల వర్షానికి ధాన్యం తడిచిన పూర్తి మద్దతు ధర ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు.
INDIA Alliance: ఎన్నికల కమిషన్ తో నేడు ఇండియా కూటమి నేతల సమావేశం
తాజావార్తలు
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
-
Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
-
OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్తో రచ్చ!
-
Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
-
Off The Record: నెల్లూరు టీడీపీ పాత నేతలకు షాకుల మీద షాకులు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!