Minister Seethakka : నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు
- బోరబండలో సీతక్క స్ట్రీట్ కార్నర్ మీటింగ్
- నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు
- బీఆర్ఎస్పై సీతక్క తీవ్ర విమర్శలు
- అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కే ఓటేయండి : సీతక్క పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మంత్రి సీతక్క ప్రచారం చేశారు. శుక్రవారం బోరబండలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడుతూ… నవీన్ యాదవ్ విజయం జూబ్లీహిల్స్ అభివృద్ధికి కొత్త మలుపు అవుతుందని సీతక్క అన్నారు. మూడు పర్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచినా, ఇప్పటికీ ప్రజలు నీటి సమస్యలు, డ్రైనేజ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. “ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖను స్వయంగా చూస్తున్నారు. కాబట్టి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి,” అని చెప్పారు.
అంతేకాకుండా.. మీరు నవీన్ యాదవ్కు ఒక అవకాశం ఇస్తే, అభివృద్ధి, సంక్షేమ పథకాలు మీ ఇంటికే వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, చవక గ్యాస్ సిలిండర్లు అందిస్తోందని, ఒక్క జూబ్లీహిల్స్లోనే రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు నవీన్ యాదవ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కానీ ఒకప్పుడు కేసీఆర్ పార్టీకి శ్రీశైలం యాదవ్ కుటుంబం ఆర్థిక సహాయం చేసింది. ఆ కుటుంబాన్ని ఇప్పుడు విమర్శించడం ప్రజలు సహించరని అన్నారు.
Also Read
బీఆర్ఎస్లో రౌడీ షీటర్లు చేరారని, బాలికలను వేధించిన వారిని కేటీఆర్ దండం పెట్టి చేర్చుకుంటున్నారన్నారు. సొంత ఆడబిడ్డ కవితనూ వేధించిన కేటీఆర్, ఇతర ఆడబిడ్డలను ఎలా రక్షిస్తారు? అని ప్రశ్నించారు. ఈ గల్లీలో పుట్టి పెరిగిన నవీన్ యాదవ్ను గెలిపించండని, అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కు ఓటేయండి, కన్నీళ్లు కావాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి అని పిలుపునిచ్చారు.
Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?