Vemula Prashanth Reddy: హరీష్ రావు ఛాలెంజ్కు నిర్మలా సీతారామన్ భయపడ్డారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Prashant Reddy criticizes Nirmala Sitharaman’s comments: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఆమెపై తెలంగాణ మంత్రులు మండిపడుతున్నారు. హరీష్ రావు ఛాలెంజ్ కి భయపడే నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకుందని ఎద్దేవా చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మాల సీతారామన్ హయాంలో రూపాయి విలువ విపరీతంగా పడిపోతుందని అన్నారు. కేసీఆర్ ను చూసి బీజేపీ వణికిపోతోందని అన్నారు. కేసీఆర్ రాష్ట్రం దాటి బయటకు వస్తే వైఫల్యాలు బయటపడతాయని కేంద్రానికి భయం పట్టుకుందని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అందుకే కేంద్ర మంత్రులు తెలంగాణకు గడికి ఒకరు వస్తున్నారని అన్నారు.
Read Also: Pocharam Srinivas Reddy: నిర్మలా సీతారామన్ నాకు అక్కతో సమానం..
Also Read
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
నిర్మలా సీతారామన్ మాట్లాడినవన్నీ అబద్ధాలే అని.. గొర్రెల పంపిణీ, చేపల పంపిణీలో కేంద్రానిది ఒక్క రూపాయి కూడా లేదని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫసల్ బీమా యోజన గుజరాత్ లోనే అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ రోజు నిర్మలా సీతారామన్ బెదిరింపు ధోరణితో మాట్లాడిందని అన్నారు. రేషన్ షాపుల్లో నరేంద్ర మోదీ ఫోటో లేదని గొడవ పెట్టుకున్నారని విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాలకు తెలంగాణ సొమ్ము వాడారు..కాబట్టి కేసీఆర్ ఫోటో పెట్టగలరా..? అని ప్రశ్నించారు. ఆహార భద్రత చట్టం కింద కేంద్రం రాష్ట్రాలకు బియ్యం ఇవ్వడం ప్రజల హక్కని తెలిపారు. రూ.3.65 లక్షల కోట్లు పన్నులు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత చెల్లించామని..కేంద్రం నుంచి రూ.1.6 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని అన్నారు.
బీహార్, యూపీ, గుజరాత్ రాష్ట్రాలకు కనీసం లక్ష కోట్లు మా డబ్బు వినియోగించారని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో కేంద్రం ఒత్తడి చేస్తేనే చేరామని ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీని గురించి నిర్మలా సీతారామన్ కు అవగాహన లేదని విమర్శించారు. అంతకు ముందు మంత్రి హరీష్ రావు 2021లోనే తెలంగాణ ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరిందని.. అలా చేరకపోతే నేను రాజీనామా చేస్తానని.. లేకపోతే మీరు రాజీనామా చేస్తారా..? అని నిర్మలా సీతారామన్ కు సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
-
Peddi : అప్పటి నుంచే జాన్వీ సీన్లు కట్ చేసిన ‘పెద్ది’!
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!