Ponnama Prabhakar: రాజాసింగ్ జోతిష్యం చదివాడా.. బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా మాట్లాతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnama Prabhakar: రాజాసింగ్ ఏమైనా జోతిష్యం చదివాడా.. బుద్ధి,జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడవచ్చా..? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడువదు అంటున్నారని తెలిపారు. బుద్ధి,జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడవచ్చా..? అని ప్రశ్నించారు. ప్రజలు తీర్పు ఇచ్చారు..ప్రభుత్వం మారింది..మీ తీరు కూడా మార్చుకోండి అని తెలిపారు. రాజాసింగ్ ఏమైనా జోతిష్యం చదివాడా.. 10 మంది ఎమ్మెల్యేలు పోతారు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో తెలుసా?
Also Read
ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు గడవకముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ఏ ఉద్దేశ్యంతో వ్యాఖ్యానిస్తున్నారు? సీనియారిటీ ప్రకారం ప్రొటెం స్పీకర్ను నియమిస్తే.. మతపరమైన అంశాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని వాపోయారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి రుజువు చేశారని ప్రజలు గమనించాలన్నారు. హైదరాబాద్లో మతకల్లోలాలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో బీజేపీ, ఇతర పార్టీలు హంగ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యయుద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సభ్య సమాజం ద్వేషిస్తోందన్నారు. అన్ని పార్టీల సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కా జవాబ్ పత్తర్ సే దేతే అని సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరు..ప్రజలు నిర్ణయించారు..ప్రభుత్వం మారింది..ప్రతిపక్షాల ఆలోచనా ధోరణి మారాలి.
Trisha: 21 ఏళ్లు అవ్వడం గొప్ప కాదు… ఇన్నేళ్లుగా స్టార్ హీరోలతో చేస్తూనే ఉంది చూడు అది గొప్ప
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!