Ponnama Prabhakar: రాజాసింగ్ జోతిష్యం చదివాడా.. బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలా మాట్లాతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnama Prabhakar: రాజాసింగ్ ఏమైనా జోతిష్యం చదివాడా.. బుద్ధి,జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడవచ్చా..? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. సిద్దిపేట జిల్లాలో పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకుసాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడువదు అంటున్నారని తెలిపారు. బుద్ధి,జ్ఞానం ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడవచ్చా..? అని ప్రశ్నించారు. ప్రజలు తీర్పు ఇచ్చారు..ప్రభుత్వం మారింది..మీ తీరు కూడా మార్చుకోండి అని తెలిపారు. రాజాసింగ్ ఏమైనా జోతిష్యం చదివాడా.. 10 మంది ఎమ్మెల్యేలు పోతారు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో తెలుసా?
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు గడవకముందే కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారతారని ఏ ఉద్దేశ్యంతో వ్యాఖ్యానిస్తున్నారు? సీనియారిటీ ప్రకారం ప్రొటెం స్పీకర్ను నియమిస్తే.. మతపరమైన అంశాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని వాపోయారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి రుజువు చేశారని ప్రజలు గమనించాలన్నారు. హైదరాబాద్లో మతకల్లోలాలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో బీజేపీ, ఇతర పార్టీలు హంగ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యయుద్ధంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై సభ్య సమాజం ద్వేషిస్తోందన్నారు. అన్ని పార్టీల సూచనలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కా జవాబ్ పత్తర్ సే దేతే అని సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారరు..ప్రజలు నిర్ణయించారు..ప్రభుత్వం మారింది..ప్రతిపక్షాల ఆలోచనా ధోరణి మారాలి.
Trisha: 21 ఏళ్లు అవ్వడం గొప్ప కాదు… ఇన్నేళ్లుగా స్టార్ హీరోలతో చేస్తూనే ఉంది చూడు అది గొప్ప
తాజావార్తలు
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
-
Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?