NTV Telugu Site icon

క‌ర్నల్ సంతోష్‌బాబు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన కేటీఆర్

Colonel Santosh Babu

సూర్యాపేట‌లో క‌ర్న‌ల్ సంతోష్ బాబు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు మంత్రి కేటీఆర్.. భారత్‌-చైనా సరిహద్దులో విధులు క‌ర్న‌ల్ సంతోష్ బాబు విధులు నిర్వ‌హిస్తుండ‌గా.. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట 15 జూన్ 2020న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరోచితంగా పోరాటం చేసి అమ‌రుడ‌య్యారు.. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రు భార‌త సైనికులు అమ‌రుల‌య్యారు.. ఆ వీరుడు నేల‌కొరిగి ఏడాది గ‌డిచింది.. దీంతో.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో కర్నల్‌ సంతోష్‌ బాబు 9 అడుగుల‌ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. ఆ విగ్ర‌హాన్ని మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డితో క‌లిసి ఆవిష్క‌రించారు మంత్రి కేటీఆర్.. ఇక‌, ఆ కార్య‌క్ర‌మానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు, వీడియోను చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..