Minister KTR: కేసీఆర్ 100 సీట్లు అన్నారు.. అందరూ మమేకం అవ్వాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Speech At Rajanna Sircilla Party Event: ఒకప్పుడు కరువుమెట్ట పంటలున్న సిరిసిల్ల ఇప్పుడు కొనసీమలాగా మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ఇదని, ఇది కేసీఆర్ దార్శనికత అని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పద్మనాయక కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బిఅర్ఎస్ జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు లేకుండా తాము లేమని అన్నారు. తెలంగాణ సాధించేందుకు అన్నం తినో, అటుకులు బుక్కో గులాబీదండు కార్యకర్తలు రాష్ట్రాన్ని సాధించారన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళిత బంధు అమలుకు కొత్త ప్రణాళికలు వేశామని, కేసీఆర్ ఇచ్చే రూ.10 లక్షలను పదింతలు చేసే శక్తి ఉన్నోళ్లను వెతికామని అన్నారు. ఇవాళ దళిత బంధు కింద తాను రైస్ మిల్లును ప్రారంభించానని, ఆ మిల్లులో బీహార్ వాళ్ళను చూశాని, మన రాష్ట్రం తెలంగాణ బిడ్డలకే కాకుండా బీహార్ బిడ్డలకు కూడా బువ్వ పెడుతోందని అన్నారు.
MLA Ramesh Babu: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మునిగిపోయిన పడవలు.. ఎమ్మెల్యే ఎద్దేవా
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
దళితులు, గిరిజనులు చేతగాని వాళ్ళు కాదు.. చేవ ఉన్నోళ్లు అని ఈ దళితబంధు తో నిరూపిస్తామని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. పదవులు వస్తుంటాయ్ పోతుంటాయని.. కానీ పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేశామో చెప్పుకునేందుకు ఒక పని అయినా ఉండాలని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీ అంటే గంగదేవిపల్లి, అంకపూర్ మాత్రమే ఉండేవని.. కానీ ఇప్పుడు తెలంగాణలో అన్ని అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో 20 ఉత్తమ పంచాయతీల లిస్ట్లో 19 తెలంగాణ గ్రామాలే ఉన్నాయన్నారు. 140 మున్సిపాలిటీలు ఉంటే.. వాటిల్లో 27 మున్సిపాలిటీలు జాతీయ అవార్డులు సాధించాయని తెలియజేశారు. రాజకీయాల్లో నేల విడిచి సాము చేయవద్దని సూచించారు. 60 లక్షల గులాబీ కుటుంబ సభ్యులని కలిసి.. వారితో మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు పక్కాగా గెలవాలని సీఎం కేసీఆర్ చెప్పారని.. ఆ సీట్లు గెలిచేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Game Changer: ఎవరిని మోసం చేస్తున్నారు.. బ్రూస్ లీ పోస్టర్ వేసి కొత్త పోస్టర్ అంటారేంటి..?
అంతకుముందు.. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో రైస్ మిల్ను ప్రారంభించిన కేటీఆర్, ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ధ్వజమెత్తారు. సాయుధ పోరాటంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర వాసులను ఎందుకు గుర్తించలేదని అమిత్షా చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన.. వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సంగా జరిపామన్నారు. విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని కొందరు అడుగుతున్నారని.. ఆగస్టు 15ను స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటున్నామని కేటీఆర్ ప్రశ్నించారు. త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యమని సూచించారు. పాత ఖైదీగా వ్యవహరించడం మాని.. భవిష్యత్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
తాజావార్తలు
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!