Minister KTR: కాంగ్రెస్ ఏమైనా కొత్త పార్టీనా చెత్తపార్టీ.. 55 ఏండ్లు మనల్ని చావగొట్టిన పార్టీ…
Minister KTR: కాంగ్రెస్ అది ఏమైనా కొత్త పార్టీనా చెత్తపార్టీ.. 55 ఏండ్లు మనల్ని చావగొట్టిన పార్టీ అని మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కేటీఆర్ రోడ్ షో చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీఓడు ఇయ్యాల పొద్దున్న ఆర్డర్ ఇచ్చి రైతుబంధు ఆపించారని మండిపడ్డారు. దేమో ఇచ్చుకోవచ్చన్నరు ఇప్పుడు ఈసీ మీద ఒత్తిడి తెచ్చి రైతు బందు ఆపిచ్చిండ్రని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం రాకముందే రైతుబంధు కాటగలిపిండ్రని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ దిక్కుమాలిన పార్టీలకు ఓటేస్తే ఆగమైతం అన్నారు. తెలంగాణలో ఉన్న రైతులు బీద బిక్కీలే వారికి 3 గంటల కరెంటు చాలంటున్నడు రేవంత్ రెడ్డి అని అన్నారు. రైతుబంధు రైతుకిస్తే, కౌలుదారుకు ఇయ్యనంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ కు ఇప్పటికే 11 ఛాన్స్ లిచ్చినం ప్రజల జీవితాలను ఆగం చేసిండ్రని అన్నారు. కాంగ్రెస్ అదేమైనా కొత్త పార్టీనా, చెత్తపార్టీ.. 55 ఏండ్లు మనల్ని చావగొట్టిన పార్టీ అన్నారు.
Read also: MLA Laxmareddy: కేసీఆర్ అంటే చేతల మనిషి… ఎన్నికల ప్రచారంలో లక్ష్మారెడ్డి
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
సీఎంగా కేసీఆర్ రైతుబంధు స్టార్ట్ చేసిండు, రైతుభీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, 24 గంటల కరెంటు ఇచ్చారని గుర్తు చేశారు. ఒకసారి తప్పుచేసి 50 ఏండ్లు బాధపడ్డం, అదే తప్పు మరోసారి చేయద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. డబ్బాలో ఓటేసే ముందుమిమ్మల్ని మీరు ప్రశ్నించుకోని ఓటేయ్యండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కావాలో కరెంటు కావాలో ఆలోచించాలని తెలిపారు. ఆగం కావద్దు అని తెలిపారు. రైతుబంధు కావాల్నా, రాబంధు కాంగ్రెస్ కావాల్నా బీజేపీ, కాంగ్రెస్ డిల్లీ నేతలంతా వచ్చి ఒక్క కేసీఆర్ బొండిగ పిసకాలని చూస్తున్నారని తెలిపారు. 55 ఏండ్లు భస్మాసుర హస్తం మనలను నాశనం చేసిందన్నారు. కత్తి ఒకనికిచ్చి యుద్దం మమ్మల్ని చేయమంటే మాతోని కాదని కేటీఆర్ స్పష్టం చేశారు.
Kishan Reddy: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే వాళ్ళను చెప్పుతో కొట్టండి.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!