MLA Laxmareddy: కేసీఆర్ అంటే చేతల మనిషి… ఎన్నికల ప్రచారంలో లక్ష్మారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Laxmareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో పార్టీ శ్రేణులు ప్రచారాలు, రోడ్ షోలతో ప్రజలను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంటి ఇంటికి తిరుగుతూ పార్టీ చేసే అభివృద్ది కార్యక్రామలు, పథకాలను వివరిస్తూ ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. జడ్చర్ల, నవాబుపేట మండలాలలోని పెద్దపల్లి, చిన్నపల్లి, బండమిదిపల్లి, ఉదండపుర్, కిష్టారం, ఖానాపూర్, కొల్లూరు, కేశవరావుపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రచారం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ కు ఓటు వేయాల్సిందే అన్నారు. బీఆర్ఎస్ ప్రచారానికి గ్రామ గ్రామాన బ్రహ్మరథం పడుతున్నారని.. పల్లె జనం నీరాజనాలు పలకుతున్నారని అన్నారు. కేసీఆర్ అంటే చేతల మనిషి అని, చెప్పింది చేసి చూపిస్తారని అన్నారు. మనం అడగకున్నా మన అవసరం ఏంటో తెలుసుకుని తీరుస్తారని తెలిపారు. అది కేసీఆర్ గొప్పతనం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని.. అందుకే రాబోయే జడ్చర్ల అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు.
Read also: Sachin Pilot: తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే..
Also Read
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
గత పది సంవత్సరాల్లో ముస్లిం మైనారిటీలకు షాదీ ముబారక్, ఇమామ్ మౌజంలకు గౌరవ వేతనం, మైనార్టీ ఓవర్సీస్ పథకం, మైనార్టీ బంధు, ప్రత్యేక మైనార్టీ గురుకులాలు లాంటి ఎన్నో పథకాలు అమలు చేసి వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు గానే వాడుకుందని విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ.. గంగా జమున తెహజీబ్ కా తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలి.. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని కొనసాగించాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
Kishan Reddy: కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావాలంటే.. రెవెన్యూ మూడింతలు కావాలి
తాజావార్తలు
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!