KTR: పెట్రోల్, డీజిల్ పై 30 శాతం సెస్ తగ్గించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే వుంది. పెట్రోలియం కంపెనీలు ఏప్రిల్ 4 సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు పెంచాయి. ఇంధన ధరల తాజా పెరుగుదల తర్వాత, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.81కి, డీజిల్ లీటరుకు రూ.94.07కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 118.81, డీజిల్ రూ. 103.04. చేరుకుంది. గత 14 రోజుల్లో 12వసారి చమురు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. నవంబర్ 4, 2021 నుంచి చమురు ధరలు దేశవ్యాప్తంగా స్థిరీకరించారు. దాదాపు ఒకటిన్నర నెలల తర్వాత అంటే మార్చి 22న మొదటిసారిగా ధరలు పెంచారు.
మార్చి 22 నుంచి ఏప్రిల్ 4 వరకు 14 రోజుల్లో 12 సార్లు చమురు ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారు. గత 14 రోజుల్లో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.8.40 పెరిగింది. మార్చి 21, 2022 వరకు ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.95.41 ఉండగా ప్రస్తుతం లీటరుకు రూ.103.81కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.36, డీజిల్ లీటరుకు రూ.99.44 గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.53గా ఉంది.
Also Read
- Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
- Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
- DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
- Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!
ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.103.60గా ఉంది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.71గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.103.81గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 118.03గా ఉండగా.. డీజిల్ ధర రూ.104.10కి పెరిగింది. హైదరాబాద్ తో పోలిస్తే ఏపీలో చమురు ధరలు ఎక్కువగానే వున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.118.55కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.90గా వుంది. ఒకేసారి 5 నుంచి 10 రూపాయలు పెంచకుండా. రోజూ లీటరుకి 40, 50 పైసలు పెంచుతూ తమ స్ట్రాటజీని అమలుచేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు.
ఇదిలా వుంటే.. పెట్రో,డీజిల్ ధరలపై ట్విట్టర్లో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో మేము గత 7 సంవత్సరాలలో (2015 జనవరి) VATని పెంచలేదు. ఇంధన ధరలను కనీసం 30% తగ్గించే ఎన్డిఎ ప్రభుత్వం విధించిన విచక్షణారహిత సెస్సులను తొలగించాలన్నది మా డిమాండ్ అన్నారు మంత్రి కేటీఆర్.
చైనీస్ హింస గురించి పుస్తకాలలో మాత్రమే చదవండి!
వరుసగా 14 రోజుల్లో 12 సార్లు పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు
అలాంటి హింసను అనేక రకాల రికార్డులను అధిగమించింది
నిర్మలా సీతారామన్ జీ, ముడిచమురు ధరలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పార్లమెంటులో చర్చకు ఎందుకు వెనుకాడుతున్నారు? అంటూ సూటిగా ప్రశ్నించారు కేటీఆర్.

Ktr Tweet
తాజావార్తలు
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!