Minister KTR: బ్రేకింగ్.. భద్రాచలంలో భారీ వర్షం.. కేటీఆర్ పర్యటన రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: మంత్రి కేటీఆర్ భద్రాచలం పర్యటన రద్దైంది. భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో భద్రాచలం పర్యటన రద్దు చేసుకొని కేటీఆర్ సత్తుపల్లి పయనం అయ్యారు. భద్రాచలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం రావడంతో మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం భద్రాచలం సత్తుపల్లిలో ఈరోజు మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుండగా ఉదయం ఖమ్మంలో పర్యటన పూర్తయింది. అనంతరం తిరిగి భద్రాచలం వెళ్లడానికి సిద్ధమవుతుండగా భద్రాచలంలో భారీ వర్షం , వాతావరణ అనుకూలించక పోవడంతో హెలికాప్టర్ కి సమస్య ఎదురైంది. ఈనేపథ్యంలో భద్రాచలం పర్యటన కేటీఆర్ రద్దు చేసుకుని సత్తుపల్లి వెళ్లారు. ప్రస్తుతం సత్తుపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది.
ఖమ్మం భద్రాద్రి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉదయం ప్రారంభమైంది. హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకుని ఖమ్మంలో 1370 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పలు అభివృద్ధి పథకాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మం మున్నేరుపై తీగల వంతెన, అదేవిధంగా మున్నేరు వల్ల ముంపును అరికట్టేందుకోసం ఆర్ సిసి వాల్ నిర్మాణాలను శంకుస్థాపనలు చేసిన అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రగతి నివేదన సభ నిర్వహించారు. ఖమ్మం నుంచి మళ్లీ భద్రాచలం బయలుదేరే సమయంలో వర్షం కారణంగా పర్యటన రద్దు చేసుకుని సత్తుపల్లికి పయనం అయ్యారు. సత్తుపల్లిలో 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పథకాలకి మంత్రులు కేటీఆర్ పువ్వాడ అజయ్ లు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. తర్వాత సత్తుపల్లిలో జరగనున్న భారీ బహిరంగ సభ ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.
Also Read
- Khaja Moizuddin Mur*der: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
సత్తుపల్లిలో షెడ్యూల్ ఇలా..
* మధ్యాహ్నం 2.30 గంటలకు సత్తుపల్లి చేరుకుంటారు.
* 2.35 గంటలకు జ్యోతి నిలయం స్కూల్ దగ్గర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
* 2.45 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అంబేద్కర్ ఆడిటోరియానికి శంకుస్థాపన చేస్తారు.
* 3 గంటలకు ఎన్టీఆర్ నగర్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
* 3.15 గంటలకు షాదీఖానాకు, క్రిస్టియన్ భవనానికి, రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.
* 3.45 గంటలకు చంద్రా గార్డెన్స్లో జరిగే సభలో పాల్గొంటారు.
* 4.50 గంటలకు సత్తుపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
Minister KTR: రెండు సార్లు మంత్రి కావడానికి కారణం ఆ పేరే..!
తాజావార్తలు
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
Spirit : స్పిరిట్.. హీరోయిన్తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే
-
Shubman Gill Record: ఐపీఎల్ ప్లేఆఫ్స్లో శుభ్మన్ గిల్ రేర్ రికార్డు.. ‘కింగ్’ కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
-
UP: ఇన్స్టా రీల్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి ప్రేమాయణం.. కట్చేస్తే..
ట్రెండింగ్
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!