Konda Surekha: గత ప్రభుత్వ నేతల ఆస్తులపై కూడా శ్వేత పత్రం విడుదల చేస్తే బాగుంటుంది
వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిలన్నింటిని అమలు చేసి తీరుతామంటున్నారు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తనకు ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా దేవాలయ భూముల కబ్జాపై ఖచ్చితంగా చర్య తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గిరిజనుల సమ్మక్క-సారక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ మహా జాతరను మంత్రి సీతక్కతో కలిసి తాను విజయవంతం చేస్తామన్నారు. ఇక ప్రభుత్వం ఇచిన్న శ్వేతా పత్రం పైనా వివాదాస్పదం చేస్తున్న టీఆర్ఎస్ ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వ ప్రధాన నేతల ఆస్తులపై కూడా శ్వేత పత్రం విడుదల చేస్తే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాకముందు వారి ఆస్తులు ఎంత.. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలన అనంతరం వారి ఆస్తుల వివరాలపై కూడా శ్వేతా పత్రం విడుదల చేస్తే బాగుంటుందన్నారు.
Also Read
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!