వరంగల్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామిలన్నింటిని అమలు చేసి తీరుతామంటున్నారు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాలయ శాఖ మంత్రి కొండా సురేఖ. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి తనకు ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ…