Jagadish Reddy: మోడీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jagadish Reddy Fires On PM Modi Governor Tamilisai: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, నయా పైసా ఇవ్వకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. మునుగోడులో ఓడిపోయిన అక్కసుతోనే నిన్న మోడీ మాట్లాడినట్టు ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను తాము బీఆర్ఎస్తో దేశమంతా ప్రచారం చేస్తామన్నారు. ఇక గవర్నర్ తమిళిసై.. గవర్నర్గా కాకుండా బీజేపీ కార్యకర్తలా పని చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మొదటి కార్యాలయం నాంపల్లిలో ఉంటే, రెండో కార్యాలయం రాజ్ భవన్లో ఉందన్నారు. ఒకవేళ గవర్నర్ ఆరు బిల్లులను ఆమోదించకపోతే.. తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని జగదీశ్ రెడ్డి తేల్చి చెప్పారు.
అంతకుముందు కూడా మోడీ తెలంగాణ పర్యటనపై జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని, మునుగోడులో బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేకే మోడీ తన అక్కసునంతా వెళ్లగక్కారన్నారు. బ్యాంకు లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ.. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం స్వామీజీలను రంగంలోకి దింపి, టీఆర్ఎస్ పార్టీలో అలజడి చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపణలు చేశారు. నాయకులు, పార్టీలను భయపెట్టి.. ఎదురులేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. సీఎం కేసీఆర్పై విషం కక్కినా తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారని.. నీళ్లు, పాలను వేరు చేసినట్టు విషాన్ని కూడా వేరు చేసే సామర్థ్యం వారికి ఉందని పేర్కొన్నారు. అబద్ధాల పునాదుల మీద పార్టీ విస్తరణకు మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరల్ని అమాంతం పెంచేసి.. పేదల బతుకులను ఆగం చేసిన వారెవరన్నది ప్రజలు గ్రహించారన్నారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు.. కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పారు.
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
తాజావార్తలు
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!