Jagadish Reddy: మోడీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jagadish Reddy Fires On PM Modi Governor Tamilisai: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, నయా పైసా ఇవ్వకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. మునుగోడులో ఓడిపోయిన అక్కసుతోనే నిన్న మోడీ మాట్లాడినట్టు ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను తాము బీఆర్ఎస్తో దేశమంతా ప్రచారం చేస్తామన్నారు. ఇక గవర్నర్ తమిళిసై.. గవర్నర్గా కాకుండా బీజేపీ కార్యకర్తలా పని చేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మొదటి కార్యాలయం నాంపల్లిలో ఉంటే, రెండో కార్యాలయం రాజ్ భవన్లో ఉందన్నారు. ఒకవేళ గవర్నర్ ఆరు బిల్లులను ఆమోదించకపోతే.. తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని జగదీశ్ రెడ్డి తేల్చి చెప్పారు.
అంతకుముందు కూడా మోడీ తెలంగాణ పర్యటనపై జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్పై విషం చిమ్మేలా మోదీ వ్యాఖ్యానించారని, మునుగోడులో బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేకే మోడీ తన అక్కసునంతా వెళ్లగక్కారన్నారు. బ్యాంకు లోన్లు రాకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీ.. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం స్వామీజీలను రంగంలోకి దింపి, టీఆర్ఎస్ పార్టీలో అలజడి చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపణలు చేశారు. నాయకులు, పార్టీలను భయపెట్టి.. ఎదురులేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. సీఎం కేసీఆర్పై విషం కక్కినా తెలంగాణ ప్రజలు హంసల్లాంటి వారని.. నీళ్లు, పాలను వేరు చేసినట్టు విషాన్ని కూడా వేరు చేసే సామర్థ్యం వారికి ఉందని పేర్కొన్నారు. అబద్ధాల పునాదుల మీద పార్టీ విస్తరణకు మోడీ ప్రయత్నిస్తున్నారన్నారు. గ్యాస్, పెట్రోల్ ధరల్ని అమాంతం పెంచేసి.. పేదల బతుకులను ఆగం చేసిన వారెవరన్నది ప్రజలు గ్రహించారన్నారు. దేశంలో బీజేపీ పీడను వదిలించుకునేందుకు.. కేసీఆర్ నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పారు.
Also Read
- Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
- Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: యాక్టివ్ మోడ్లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
తాజావార్తలు
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
-
Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
-
Lenovo Yoga Tab Plus Gen 2: 12,700mAh బ్యాటరీ.. 4K 144Hz డిస్ప్లే.. లెనోవో యోగా ట్యాబ్ ప్లస్ జెన్ 2 వచ్చేసింది
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!