NTV Telugu Site icon

Mallannasagar: మ‌ల్ల‌న్న సాగ‌ర్ దేశానికే త‌ల‌మానికం… ఎంద‌రు అడ్డుకున్నా…

సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ప్ర‌భుత్వం నిర్మించిన మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ ను ఈరోజు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించారు. రిజ‌ర్వాయ‌ర్‌ను ప్రారంభించ‌డానికి ముందు కేసీఆర్ మ‌ల్ల‌న్న‌కు పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం రిజ‌ర్వాయ‌ర్‌ను ప్రారంభించి నీటిని విడుద‌ల చేశారు. అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌లో ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు మాట్లాడారు. మ‌ల్ల‌న్న సాగ‌ర్ తెలంగాణ‌కే త‌ల‌మానికం అని అన్నారు. ప్ర‌తిప‌క్షాలు ఎన్ని కుట్ర‌లు చేసినా ప్రాజెక్టు ఆగ‌లేద‌ని, ప్రాజెక్టుపై వందలాది కేసులను సుప్రీంకోర్టు కోట్టేసిన రోజ‌ని అన్నారు. దేశంలో న‌దిలేని చోట ప్రాజెక్టు క‌ట్టింది కేసీఆర్ మాత్ర‌మేన‌ని అన్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తెలిసిన ఉద్య‌మ‌నాయ‌కుడు కేసీఆర్ అని మంత్రి హ‌రీష్‌రావు పేర్కొన్నారు.

Read: Friendship: క‌ల్మ‌షంలేని స్నేహం… ఇదేక‌దా జీవితం…