Arutla Hills Venture: ఉక్కా, మద్యం సేవించి యువత హంగామా.. తలపట్టుకుంటున్న గ్రామస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arutla Hills Venture: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ఆరుట్ల హిల్స్ వెంచర్ లోని విల్లాస్ లో అర్ధరాత్రి అమ్మాయిల అబ్బాయిల హంగామా సృష్టించారు. అక్కడ సిమ్మింగ్ చేస్తూ ఉక్కా, మద్యం సేవించి ఆట, పాటలతో హోరెత్తించారు. వారి అరుపులకు గ్రామస్తులు తలపట్టుకుంటున్నారు. ఇక్కడికి ఎవరు ఎప్పుడు వస్తారో తెలియడం లేదని, అందరిని అనుమతిస్తున్నారని ఆగోళను భరించలేకపోతున్నామని అంటున్నారు. మద్యం, హక్కు సేవించి అమ్మాయిలు, అబ్బాయిలు మత్తులో తూగుతూ డ్యాన్సులు చేస్తున్నారని, ఆ సౌండ్లు భరించలేక పోతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయని కానీ, పట్టించుకునే నాధుడు కరువయ్యారని చెబుతున్నారు. రాత్రి ఈగోళకు ఇళ్లల్లో వుండలేకపోతున్నామని, మా పిల్లలు కూడా ఇటువంటి వాటికి అలవాటు పడతారేమో అనేభయంతో గడుపుతున్నామని తెలిపారు. ఇక్కడ అడవి ప్రాంతంలో గెస్ట్ హౌస్ లు కట్టి నగరంలో ఉన్న విద్యార్థులకు జల్సా రాయలకు రెంట్లు ఇవ్వడం జరుగుతుందని విమర్శించారు.
ఇక్కడికి రాత్రి సమయంలో ఎవరు వస్తారో తెలియదు, ఎవరు పోతారు కూడా తెలవదని గ్రామస్తులు వాబోతున్నారు. రాత్రి మూడు గంటల సమయంలో తాగి అరుపులు డాన్సులు చేస్తూన్నారని. ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇక్కడికి నిన్న 12 మంది అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు వున్నారని వారందరూ.. నగరంలోని ఎం.వి.ఎస్.ఆర్ కాలేజ్ చెందిన విద్యార్థులు అని తెలిపారు. ఒక అబ్బాయిది పుట్టినరోజు ఉండడం ద్వారా ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. వారందరికి వార్నింగ్ ఇచ్చామని అన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు మాట్లాడుతూ.. అరుట్ల హిల్స్ ఘటన పై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు. Mvsr కాలేజ్ యువత బర్త్ డే చేసుకున్నారని, అసభ్యకరమైన కార్యకలాపాలు, హుక్కా సేవించిన ఆధారాలు లేవని అన్నారు. రిసార్ట్ కి అనుమతుల పై ఎంక్విరీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also Read
పబ్బుల్లో రాత్రి 10 గంటల తరువాత నో సౌండ్ అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గత కొద్దిరోజులుగా పబ్లో జరుగుతున్న ఘటనల దృష్యా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. జూన్ లో అమ్నిసియా పబ్ ఘటన సంచలనంగా మారడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు పబ్ లను మైనర్లను పబ్లలోకి అనుమతించరాదని, పబ్ లు 10 గంటల తరువాత నడపకూడదని ఆర్డర్ వేసింది. పబ్బులపై ప్రజల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చినందుకే ఈ సమీక్ష నిర్వహించడం జరిగిందని.. నివాసితులకు అసౌకర్యం కలిగించొద్దని చెప్పారు. రాత్రి 10 గంటల తరువాత పబ్లు సౌండ్ బంద్ కావడంతో.. యువత వాలర్ ఫాల్స్, నగర సివార్లలో ఎంజాయ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
Whatsapp: వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్.. జూమ్, గూగుల్ మీట్లా…!
తాజావార్తలు
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Donald Trump: భారత్ పర్యటనకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఎప్పుడంటే..?
-
Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
-
MP Uday Srinivas: ‘జనసేన అధికారంలోకి వస్తే కాపు సీఎం’.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!