Kolkata Murder Case: రేపు దేశవ్యాప్తంగా 24 గంటల పాటూ వైద్య సేవలు బంద్..
- ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వైద్య సేవలు బంద్..
- 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18 ఉదయం 6 గంటల వరకు..
- 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Murder Case: కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ హత్యకేసులో నిందితులను శిక్షించాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఏడు రోజులుగా ఆరోగ్య సేవలు స్తంభించగా, తోటి విద్యార్థికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.
Read also: Special 19Team : జమ్ము కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడేందుకు ‘స్పెషల్ 19’ టీమ్ ఏర్పాటు
Also Read
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
- Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
కాగా, ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ బోస్ సంబంధిత జూనియర్ వైద్యులతో మాట్లాడారు. దేశంలోని అన్ని నగరాల్లో వైద్యులు నిరసనలు తెలుపుతున్నారు. విధుల నుంచి బహిష్కరించిన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా రేపు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. 17వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అత్యవసర వైద్య సేవలకు మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు అర్ధరాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
Read also: Eatala Rajendar: బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం అనేది అబద్ధం.. అలాంటి చర్చ లేదు..
మరోవైపు జూనియర్ డాక్టర్ హత్యపై పశ్చిమ బెంగాల్ అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళా స్వాతంత్య్రం కోసం నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల అర్ధరాత్రి మహిళలు నిరసన తెలిపారు. ఆందోళనకారులుగా చెప్పుకుంటున్న దాదాపు 40 మంది వ్యక్తులు గురువారం అర్ధరాత్రి RG కార్ హాస్పిటల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారులు ఆస్పత్రి ఆవరణలోకి చేరుకుని అత్యవసర విభాగం, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణం, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.
CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై సీఎం చిట్ చాట్..
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!