ACB: వైద్యఆరోగ్యశాఖలో అవినీతి జలగలు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Officer caught by ACB while taking bribe: వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి జలగలు జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఎంత మంది ఏసీబీకి పట్టుబడినా ఎన్ని అరెస్టులు జరిగినా ఏ మాత్రం జంకడం లేదు. గతంలో అవినీతి నిరోధక శాఖకు పట్టుబడితే కేసు తేలే వరకు ఏళ్లు గడిచేది. కానీ ప్రస్తుత రోజుల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడితే ఏమంత నేరం కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి నిరోధకశాఖ అధికారుల చేతిలో అరెస్టయిన 6 నెలలు లేదా ఏడాదిలోగా మళ్లీ సేమ్ పోస్టింగ్ తెచ్చుకుంటున్నారు. ఓ ఏడాది తర్వాత మళ్లీ లాభదాయకమైన ప్రాంతాల్లోకి మారుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఏ చిన్న పని కోసం వెళ్లినా పైసల్ లేనిదే పని జరగడం లేదు.
Read also: Mexico Shooting: బార్లో కాల్పుల కలకలం.. 9 మంది మృతి
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
లంచం ఇచ్చుకోలేని వారు అధికారుల చుట్టూ చెప్పులరిగే తిరగాల్సిందే. అలా తిరిగినా పని అవుతుందన్న నమ్మకమూ లేదు. ఇలాంటి ఘటనే నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. నారాయణపేటలో వైద్యఆరోగ్యశాఖలో అవినీతి జలగలు బయటపడ్డారు. హనుమంతు అనే అధికారి పాతిక వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. హనుమంతును విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి రవడంతో షాక్ తిన్న ఏసీబీ అధికారులు. DM&HO రాం మనోహర్ సూచన మేరకే డబ్బులు డిమాండ్ చేసినట్లు హనుమంతు అధికారుల ముందు ఒప్పుకున్నాడు. ఆసుపత్రుల నుంచి నెల వారి మామూళ్లు, సిబ్బంది పోస్టింగ్ ల నుంచి వసూళ్లలో కీలకం హనుమంతే అని నిర్ధారించారు. హనుమంతుని రాత్రి 2 గంటల వరకు సాగిన విచారించారు అధికారులు. DM&HO రాం మనోహర్ పై శాఖాపరమైన విచారణ కొనసాగుతుంది.
Read also: Mexico Shooting: బార్లో కాల్పుల కలకలం.. 9 మంది మృతి
నారాయణపేట జిల్లాలోని డీఎంఅండ్హెచ్వో కార్యాలయంపై గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈనేపథ్యంలో.. కోస్గీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఏర్పాటుకు అనుమతి కోసం జిల్లా వైద్యశాఖ మాస్ మీడియా అధికారి హన్మంతు రూ.80 వేలను డిమాండ్ చేశాడు. అయితే.. బాధితుడు, ప్రైవేట్ ఆస్పత్రి మేనేజర్ కలాల ఆంజనేయులు గౌడ్ ఏసీబీని ఆశ్రయించాడు. అయితే.. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.అతడిపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Moinabad Episode: రెండో రోజు కస్టడీ.. కీలకం కానున్న ఎఫ్ఎస్ఎల్ నివేదిక
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!