Mayor Vijayalakshmi: నేడు కాంగ్రెస్ లోకి గద్వాల్ విజయలక్ష్మి.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో..
Mayor Vijayalakshmi: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇవాళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. ఆమెతో పాటు ఆమె తండ్రి కేశరావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అయితే ఆమె మార్పుతో ఎలాంటి ఢోకా ఉండదు. అలాగే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్లో చేరినా ఆమె పదవికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎమ్మెల్యేలు ఎన్నికైన పార్టీ నుంచి మరో పార్టీలోకి మారితే అనర్హత వేటు పడే ప్రమాదం ఉంది కానీ.. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల ప్రకారం కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ల పాత్రలు మారినప్పటికీ వారి పదవులు కోల్పోయే అవకాశం లేదు.
Read also: Pawan Kalyan: పిఠాపురానికి పవన్ కల్యాణ్.. నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
మొత్తం పాలకమండలిలో మెజారిటీతో కూడిన అవిశ్వాస తీర్మానం ద్వారా మాత్రమే వారు తమ పదవులను కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, అధికారం చేపట్టిన నాలుగేళ్ల తర్వాత కూడా అలాంటి అవకాశం లేదు. అందుకే ఏ పార్టీలోకి మారినా దాదాపు మరో ఏడాది వరకు వారి పదవులకు నష్టం లేదు. ప్రస్తుత పాలకమండలిలో మేయర్గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా శ్రీలత 11 ఫిబ్రవరి 2021న బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 10, 2025 వరకు వారి పదవులకు ఎలాంటి ముప్పు లేదు. వారి పనితీరు బాగా లేకున్నా, మరేదైనా కారణాల వల్ల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే. కాగా.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో పార్టీల బలాబలాలు, అవిశ్వాస తీర్మానాలు అసలు విషయం కాదని అధికారులతో పాటు రాజకీయ నేతలు చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వారి పదవీకాలం స్వల్పకాలమే ఉండేది. అప్పటికి పార్టీల బలాబలాలలో పెనుమార్పులు వచ్చే అవకాశాలున్నాయి.
Pawan Kalyan: పిఠాపురానికి పవన్ కల్యాణ్.. నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..
తాజావార్తలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!