Pawan Kalyan: పిఠాపురానికి పవన్ కల్యాణ్.. నేడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ఓవైపు.. ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచి ముందుకు సాగుతుండగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయ్యారు.. నేటి నుంచి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన.. ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.. నేటి నుంచి నాలుగు రోజుల పాటు పిఠాపురంలో జనసేనాని పర్యటన కొనసాగనుంది.. తన పోటీపై ప్రకటన చేసిన తర్వాత తొలిసారి పవన్ పిఠాపురం వస్తుండడంతో.. ఆసక్తికరంగా మారింది.
Read Also: Virat Kohli- Gambhir: వీరికి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చు: సునీల్ గవాస్కర్
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
నేడు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గొల్లప్రోలుకు చేరుకుంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తొలిరోజు శక్తిపీఠం పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. అనంతరం దత్త పీఠాన్ని దర్శించుకుంటారు.. ఆ తర్వాత దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లి.. ఆయనతో సమావేశం కానున్నారు.. సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక, తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని వస్తుండడంతో.. పొలిటికల్ హీట్ పెరిగినట్టు అయ్యింది.. ఈ పర్యటనలో పార్టీ క్యాడర్ తో సమావేశాలు, నియోజకవర్గానికి చెందిన పలు వర్గాలతో మీటింగ్లు ప్లాన్ చేసింది జనసేన.. ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు పవన్ కల్యాణ్.. ఇక, మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు పిఠాపురంలో .. ఏప్రిల్ 3న తెనాలిలో, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న పవన్.. 9వ తేదీన పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొంటారు.. 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరంలో పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని జనసేన ప్రకటించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!