Maoists : మరోసారి మావోయిస్టుల సంచలన ప్రకటన
- మరోసారి మావోయిస్టుల సంచలన ప్రకటన
- కేంద్ర కమిటీ అధికారి ప్రతినిధి అభయ్ స్టేట్మెంట్తో మాకు సంబంధం లేదు
- శాంతి చర్చలు జరగాలని మార్చి నుంచి ప్రతిపాదనలు చేస్తున్నాం
- ఆపరేషన్ కాగర్ నిలిపివేసి శాంతియుతంగా చర్చలు జరగాలి
- కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారు
- శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్థరహితం
- ఇలాంటి ప్రకటనలు చేసే వారు పార్టీ అనుమతి తీసుకునే చేస్తే బాగుండేది -మావోయిస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists : మావోయిస్టు పార్టీ లోపల విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇటీవల విడుదల చేసిన “సాయుధ పోరాట విరమణ” ప్రకటనపై మావోయిస్టు నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు జగన్ అనే పేరుతో కేంద్ర కమిటీ తరఫున రెండు పేజీల లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో అభయ్ చేసిన ప్రకటన పూర్తిగా వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా శాంతి చర్చల కోసం పార్టీ తరఫున ప్రతిపథనలు జరుగుతున్నప్పటికీ, ఆయుధాలను వదిలివేయడం, సాయుధ పోరాటానికి ముగింపు పలకడం వంటి ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలుగా పేర్కొన్నారు.
చిన్న గింజలు, చియా గింజల్లో పెద్ద ప్రయోజనాలు !
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
జగన్ విడుదల చేసిన లేఖలో, “ఈ ఏడాది మార్చి నుండి మేము శాంతి చర్చల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆపరేషన్ కాగర్ నిలిపివేసి, శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని మా డిమాండ్. అయితే పార్టీ చర్చలు లేకుండా, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని ప్రకటనలు చేయడం అనర్హం” అని హెచ్చరించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు కొందరు అనారోగ్యం కారణంగా లొంగిపోతున్నారని, శాంతి చర్చలపై అభిప్రాయాలు పంపించాలంటూ అభయ్ ఇచ్చిన మెయిల్ అడ్రస్ ఎటువంటి అర్థం ఉండదని లేఖలో పేర్కొన్నారు.
“ఇలాంటి ప్రకటనలు చేసే వారు పార్టీ అనుమతి తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆయుధాలు వదిలేస్తామని ఏకపక్షంగా ప్రకటించడం తీవ్రంగా అభ్యంతరకరమైందే కాకుండా పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం” అని జగన్ లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖతో మావోయిస్టు పార్టీలో ఉన్న లోతైన విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఒకవైపు శాంతి చర్చలపై ఆసక్తి చూపుతున్నా, మరోవైపు ఆయుధాలు పూర్తిగా వదిలివేయడంపై మాత్రం అంగీకారం కరువైనట్లు కనిపిస్తోంది.
Eluru : ఎలూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతల ఆందోళన…అడ్డుకున్న పోలీసులు
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..