Maoists : మరోసారి మావోయిస్టుల సంచలన ప్రకటన
- మరోసారి మావోయిస్టుల సంచలన ప్రకటన
- కేంద్ర కమిటీ అధికారి ప్రతినిధి అభయ్ స్టేట్మెంట్తో మాకు సంబంధం లేదు
- శాంతి చర్చలు జరగాలని మార్చి నుంచి ప్రతిపాదనలు చేస్తున్నాం
- ఆపరేషన్ కాగర్ నిలిపివేసి శాంతియుతంగా చర్చలు జరగాలి
- కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారు
- శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్థరహితం
- ఇలాంటి ప్రకటనలు చేసే వారు పార్టీ అనుమతి తీసుకునే చేస్తే బాగుండేది -మావోయిస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists : మావోయిస్టు పార్టీ లోపల విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇటీవల విడుదల చేసిన “సాయుధ పోరాట విరమణ” ప్రకటనపై మావోయిస్టు నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు జగన్ అనే పేరుతో కేంద్ర కమిటీ తరఫున రెండు పేజీల లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో అభయ్ చేసిన ప్రకటన పూర్తిగా వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా శాంతి చర్చల కోసం పార్టీ తరఫున ప్రతిపథనలు జరుగుతున్నప్పటికీ, ఆయుధాలను వదిలివేయడం, సాయుధ పోరాటానికి ముగింపు పలకడం వంటి ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలుగా పేర్కొన్నారు.
చిన్న గింజలు, చియా గింజల్లో పెద్ద ప్రయోజనాలు !
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
జగన్ విడుదల చేసిన లేఖలో, “ఈ ఏడాది మార్చి నుండి మేము శాంతి చర్చల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆపరేషన్ కాగర్ నిలిపివేసి, శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని మా డిమాండ్. అయితే పార్టీ చర్చలు లేకుండా, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని ప్రకటనలు చేయడం అనర్హం” అని హెచ్చరించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు కొందరు అనారోగ్యం కారణంగా లొంగిపోతున్నారని, శాంతి చర్చలపై అభిప్రాయాలు పంపించాలంటూ అభయ్ ఇచ్చిన మెయిల్ అడ్రస్ ఎటువంటి అర్థం ఉండదని లేఖలో పేర్కొన్నారు.
“ఇలాంటి ప్రకటనలు చేసే వారు పార్టీ అనుమతి తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆయుధాలు వదిలేస్తామని ఏకపక్షంగా ప్రకటించడం తీవ్రంగా అభ్యంతరకరమైందే కాకుండా పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం” అని జగన్ లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖతో మావోయిస్టు పార్టీలో ఉన్న లోతైన విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఒకవైపు శాంతి చర్చలపై ఆసక్తి చూపుతున్నా, మరోవైపు ఆయుధాలు పూర్తిగా వదిలివేయడంపై మాత్రం అంగీకారం కరువైనట్లు కనిపిస్తోంది.
Eluru : ఎలూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతల ఆందోళన…అడ్డుకున్న పోలీసులు
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!