Bhatti Vikramarka: పీపుల్స్ మార్చ్ కు ఏడాది పూర్తి.. నేడు ఆదిలాబాద్ కు భట్టి విక్రమార్క..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: నేడు ఆదిలాబాద్ జిల్లాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. బజార్ హత్నూర్ మండలం పీప్రికి వెళ్లనున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను పిప్పీరి నుంచి భట్టి ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈరోజుతో పాదయాత్ర ప్రారంభంకు ఏడాది పూర్తీ చేసుకుంది. ఏడాది పూర్తి అయిన సంధర్భంగా పీప్రికి బట్టి వెళ్లనున్నారు. ఉదయం హెలిప్యాడ్ ద్వారా అక్కడకు చేరుకుని..పలు కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొననున్నారు. చారిత్రాత్మక పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేడు ఏడాది పూర్తి చేసుకుందని భట్టి విక్రమార్క ఆనందం వ్యక్తం చేశారు. పాదయాత్రలో చూసిన కష్టాల నుండి ఉద్భవించిన హామీలే నేడు తెలంగాణ ప్రజల ప్రభుత్వంలో ప్రజా పాలన సుపరిపాలనకు తొలి అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, బజారహత్నూర్ మండలం, పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16- 2023న హాత్ సే హాత్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభమైంది.
Read also: Rc16 : రామ్ చరణ్ – బుచ్చిబాబు సినిమా టైటిల్ అది కాదా..మరి?
Also Read
- Hyderabad : కేబీఆర్ పార్క్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే.!
- Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 1364 కిలోమీటర్లు, 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాలు, 700 గ్రామాలకు పైగా 109 రోజుల పాటు అలుపెరగని పాదయాత్ర చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో నమ్మకం, విశ్వాసం, భరోసా కల్పించింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటితో ఏడాది పూర్తి సుకుంది. ఈ పాదయాత్రలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు భట్టి. మనిషి సంకల్పానికి ఏది అడ్డుపడది అని భవిష్యత్ తరాలకు చెప్పడానికి ఉదాహారణే పట్టు వదలని పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అన్నారు. మండుటెండల్లో 1364 కిలోమీటర్లు అలుపెరగని పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పాలన నుండి విముక్తి కలిగించి స్వేచ్ఛాయుత ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నేటికి ఏడాది పూర్తి చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు.
Lok Sabha Election 2024 : దేశంలో ఓటర్లెంతమంది ? తమ ఎంపీని ఫస్ట్ టైం ఎన్నుకునే వాళ్లెందరు ?
తాజావార్తలు
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
-
Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
-
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?