Site icon NTV Telugu

Bhatti Vikramarka: మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో TSRTC ఎండీ సజ్జ నార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 50% ఎరియర్ బాండ్స్ నీ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలకి కోసం చాలా ఇబ్బంది పడేవారని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారన్నారు. TSRTC అభివృద్ధి కి ప్రభుత్వ సహాయం అందుతూనే ఉంటుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందని తెలిపారు. మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అభివృద్ధి కృషికి చూస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశామని అన్నారు.

Read also: Haryana: హర్యానా సీఎం రాజీనామా.. కారణం అదే..?

TSRTC ఎండీ సజ్జ నార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సహకారంతో TSRTC అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 75 ఎలక్ట్రిక్ బస్సులున్నాయని తెలిపారు. 22 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరో 150 ఎలక్ట్రిక్ బస్సులు జూన్ వరకు వస్తాయన్నారు. ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ టూరిస్ట్ ప్లేస్ గా వృద్ది చెందుతుందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు టూరిజం డెవలప్మెంట్ కి ప్రోత్సాహంగా ఉంటాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి, ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు. గ్రామాల్లో బస్సులు రావాల్సిన అవసరం ఉందన్నారు. బస్సులు లేక స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Haryana: హర్యానా సీఎం రాజీనామా.. కారణం అదే..?

Exit mobile version