Telangana: పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్.. ఆ పని చేసినందుకే ఇలా..
- మిడ్జిల్ పాఠశాల ఇంగ్లీష్ టీచర్ సస్పెండ్..
- కమిటీ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఆదేశాలు జారీ..
- విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇంగ్లీష్ టీచర్ సయ్యద్ ఖలీల్ పాషాపై వేటు పడింది. వృత్తి పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం వంటి కారణాలతో ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి స్థానికంగా చర్చనీయాంశమైంది.
సయ్యద్ ఖలీల్ పాషా పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకాకపోవడమే కాకుండా.. తన గైర్హాజరీని దాచిపెట్టేందుకు హాజరు రిజిస్టర్ను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా.. బోధన విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
Also Read
- Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
- Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- CM Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి.. ఈ సారి ఎందుకో తెలుసా?
Also Read:Sundar Pichai: గూగుల్ పిచాయ్కు ఇచ్చే ప్యాకేజీతో ఒక చిన్న దేశాన్నే కొనొచ్చు తెలుసా!
ఈ ఫిర్యాదులపై జిల్లా విద్యాశాఖ లోతుగా విచారణ చేపట్టింది. తొలుత క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఖలీల్ పాషాను జడ్చర్ల మండలం పోలేపల్లి ఉన్నత పాఠశాలకు డిప్యూటేషన్పై బదిలీ చేశారు. అయితే.. పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య జరిగిన గొడవలు, అంతర్గత కలహాలపై విచారించేందుకు ‘త్రీ మెన్ కమిటీ’ని రంగంలోకి దించారు.
గత వారం రోజుల క్రితం మిడ్జిల్ పాఠశాలను సందర్శించిన ఈ కమిటీ సభ్యులు.. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి.. ఉపాధ్యాయుడి బాధ్యతారాహిత్యాన్ని ధృవీకరిస్తూ జిల్లా కలెక్టర్కు సమగ్ర నివేదికను సమర్పించారు. కమిటీ నివేదికను పరిశీలించిన కలెక్టర్, నిబంధనలను ఉల్లంఘించిన సయ్యద్ ఖలీల్ పాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశానుసారం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.
తాజావార్తలు
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!