Site icon NTV Telugu

తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్…

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరణ చేయటానికి జీవో నెంబర్ 16ను నిలిపి వేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. తాజాగా ఈ పిల్ నంబర్ 122/2017 ను కొట్టి వేసింది కోర్ట్. అలాగే ఈ పిటిషన్ వేసిన వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా వేసింది. అయితే క్రమబద్దీకరణకు అనుకూలంగా వాదించింది ప్రభుత్వం. ఈ క్రమబద్ధీకరణకు 2016లో జీవో 16 జారీ చేసింది ప్రభుత్వం. కానీ ఈ జీవో 16పై హైకోర్టులో నిరుద్యోగి జె.శంకర్ 2017లో పిల్ దాఖలు చేసారు. అయితే ఈ జీవోపై గతంలో స్టే ఇవ్వడంతో నిలిచిపోయిన క్రమబద్ధీకరణ ప్రక్రియకు.. ఇప్పుడు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆ పిల్ కొట్టివేయడంతో లైన్ క్లియర్ అయ్యింది.

Exit mobile version