Delhi: ఆ భవనం మాకిచ్చేయండి.. ఏపీని కోరిన తెలంగాణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP-Telangana Bhavan in Delhi: ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ భవన్ను పూర్తిగా తమకు అప్పగించాలని తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులను కోరారు. దీనికి ప్రతిఫలంగా పటౌడీ హౌస్లో ఏడెకరాల భూమిని ఇవ్వాలని ప్రతిపాదించారు. అక్కడ కొత్త భవనం నిర్మించాలని సూచించారు.
ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఏపీ భవన్ రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తిగా కొనసాగుతోంది. ఏపీ-తెలంగాణ భవన్, ఇతర స్థిరాస్తుల విభజనపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోంశాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో బుధవారం (ఏప్రిల్ 26) రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు ఈ ప్రతిపాదనను ఏపీ అధికారుల ముందు ఉంచారు. సమావేశం అనంతరం పటౌడీ హౌస్లోని స్థలాన్ని ఏపీ అధికారుల బృందం పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ అధికారుల బృందంలో ఎస్ఎస్ రావత్, ఆదిత్యనాథ్ దాస్, ప్రేమచంద్రారెడ్డి, ఏపీ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఉన్నారు. సమావేశానికి తెలంగాణ తరపున రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు.
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
Read also: Delhi Liquor Scam: లిక్కర్ కేసులో మరో మలుపు.. ఛార్జిషీట్ లో మరో ముగ్గురు
ఢిల్లీలో ఉమ్మడి ఆస్తుల విభజనపై ఈ భేటీలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో, ఉమ్మడి ఆస్తులు 52 : 48 నిష్పత్తిలో AP మరియు తెలంగాణలకు పంపిణీ చేయబడ్డాయి. ఢిల్లీ అశోకా రోడ్ మరియు శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్తో కలిపి, రెండు రాష్ట్రాల ఉమ్మడి విస్తీర్ణం 19.733 ఎకరాలు. ఇందులో అశోకారోడ్డులోని ఏపీ-తెలంగాణ భవన్ 8.726 ఎకరాల్లో ఉంది. ఇందులో ఏపీ వాటా 4.3885 ఎకరాలు (రూ. 1,703.6 కోట్లు), తెలంగాణ వాటా 4.3375 ఎకరాలు (రూ. 1,694.4 కోట్లు). 0.511 ఎకరాల రహదారిలో 0.2555 ఎకరాలు (రూ. 160 కోట్లు) రెండు రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణ పరిధిలో గోదావరి బ్లాక్ 4.082 ఎకరాలు (రూ. 1,614.40 కోట్లు), నర్సింగ్ హాస్టల్ 3.367 ఎకరాలు (రూ. 1,318 కోట్లు), శబరి బ్లాక్ 4.133 ఎకరాలు (రూ. 1,623.60 కోట్లు), పటౌడీ హౌస్ 7.640 ఎకరాలు, 3.640 ఎకరాలు. AP కింద. . పటౌడీ హౌస్ మొత్తం 19.733 ఎకరాల్లో శ్రీమంత్ మాధవరావు సింథియా మార్గ్లో పూర్తిగా వేరు చేయబడింది. దీని విస్తీర్ణం 7.640 ఎకరాలు.
ఇది కేసీఆర్ కోరిక..!
పటౌడీ హౌస్ స్థలాన్ని ఏపీ తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మిస్తే రెండు రాష్ట్రాల భవనాలు ఒకే చోట ఉండవని, వేర్వేరుగా ఉంటాయని తెలంగాణ అధికారులు ప్రతిపాదించారు. రెండు రాష్ట్రాల భవనాలు పూర్తిగా వేరు వేరు ప్రదేశాల్లో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి ఏపీ-తెలంగాణ భవన్, శబరి బ్లాక్, రోడ్డు, నర్సింగ్ హాస్టల్ ఉన్న 12 ఎకరాల స్థలం తమ సొంతం కావాలన్నదే ముఖ్యమంత్రి కోరిక అన్నారు. 58 : 42 నిష్పత్తిలో ఏపీకి ఇచ్చే భూమికి మార్కెట్ ధర చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ అధికారులు తెలిపారు.ఈ ప్రతిపాదన బాగుందని ఏపీ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. ఆయన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే వారం మరోసారి సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.
Inter students: ఇంటర్ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. మధ్యలో మానేస్తే ఫీజు వాపసు
తాజావార్తలు
-
Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
-
Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్లో మాయమైన వైరస్ శాంపిల్స్!
-
Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?
-
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..
-
INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్బై.. బయటకొచ్చినట్లు ప్రకటన