Kushaiguda Police: ఐదుగురు అధికారులపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు..
- ఐదుగురు అధికారులపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు..
- ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన ఆ ఐదుగురు అధికారులు..
Kushaiguda Police: ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన ఆ ఐదుగురు అధికారులపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ హైకోర్టులో వాదించి గత జూలై 24న ఉత్తర్వులు తెచ్చిన విషయం విధితమే. ఇందులో భాగంగా కాప్రా పూర్వపు తహశీల్దార్ ఎస్తేర్ అనిత, పూర్వపు సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి, పూర్వపు కాప్రా మండల సర్వేయర్ శ్రీష్మా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లపై కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఈ అంశంపై విచారణ జరిపి, అభియోగ పత్రం దాఖలు చేయాలని కుషాయిగూడ పోలీసులను హైకోర్టు ఆదేశించిన విషయం విధితమే. ఈ కేసుకు సంబంధించిన వివరాలను న్యాయవాది సుంకర నరేష్ వెల్లడించారు.
Read also: Astrology: సెప్టెంబర్ 04, శనివారం దినఫలాలు
Also Read
- Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
- Hyderabad Honeytrap: తల్లి సహకారంతోనే కొడుకుల 'రొమాంటిక్' ట్రాప్.. రంగంలోకి సీపీ సజ్జనార్
- Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
కాప్రా మండలంలో సర్వే నెంబర్ 199 లోని ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్177లో పట్టా భూమిగా చూపిస్తూ కొంత మంది భూ ఆక్రమణ దారులతో కలిసి అప్పటి కాప్రా మండల తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మండల సర్వేయర్ శ్రీష్మా, రెవిన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు ధ్రువపత్రాలు తయారుచేసి, పూర్వపు రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన లొకేషన్ స్కెచ్స్ మ్యాప్ జారీ చేశారని తెలిపారు. అప్పటి సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసారు. అధికారులు చేస్తున్న చట్ట వ్యతిరేక చర్యలను కుషాయిగూడకు చెందిన చప్పిడి కృష్ణారెడ్డి అనే సామాజిక కార్యకర్త పలుమార్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సదరు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నిర్దారిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిసిఎల్ఏ కమీషనర్ కు తెలిపారు.
Read also: BCCI: బీసీసీఐ సెలెక్షన్ కమిటీలో మార్పు.. మాజీ వికెట్ కీపర్ ఎంట్రీ!
ఆ నివేదిక ఆధారంగా కృష్ణారెడ్డి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో అవినీతి అధికారులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసారు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయవాది సుంకర నరేష్ ద్వారా మల్కాజిగిరి కోర్టు లో కేసు వేయగా ప్రభుత్వ అధికారుల మీద కేసు నమోదు చేయడానికి ముందస్తు అనుమతి తప్పనిసరి అని కింది కోర్టు ఆ కేసును తిరస్కరించింది. దీంతో న్యాయవాది సుంకర నరేష్ కింది కోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంగించే విధంగా ఉన్నాయని హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని విధుల్లో నేరానికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసు నమోదు చేయడానికి ఎవరి నుండి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కింది కోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. విచారణ చేపట్టి కోర్టులో నేర అభియోగపత్రం దాఖలు చేయాలని హైకోర్టు కుషాయిగూడ పోలీసులను ఆదేశించిందని బాధితుడి తరుపు న్యాయవాది సుంకర నరేష్ తెలిపారు.
Paris Paralympics 2024: టోక్యో రికార్డు బ్రేక్.. పారాలింపిక్స్లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
Mamata Banerjee: టీఎంసీ ఓడిపోలేదు.. విలన్లతో పోరాడింది.. మమత సంచలన ఆరోపణలు
-
TVK Vijay: దళపతి విజయ్ కులం ఏంటి..? గూగుల్లో తెగ వెతికేస్తున్నారుగా..
-
TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక నిర్ణయం.. ఏ పార్టీలతో వెళ్లబోతున్నారంటే..!
-
Krishna Deer Hunting : కృష్ణ జింకల వేట.. ముగ్గురు నిందితుల అరెస్ట్..!
-
Vijay TVK: విజయ్ డూప్’తో సీఎంను ఓడించిన బాబు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!