Kuna Srisailam Goud: ఆ ఎమ్మెల్యే ఓ దద్దమ్మ.. కేసీఆర్, కేటీఆర్లకు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuna Srisailam Goud Challenges KCR and TRS: కుత్బుల్లాపూర్కు ఓ దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నాడంటూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిందేమీ లేదని, ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కేశాడని ఫైర్ అయ్యారు. ‘‘కేసీఆర్, కేటీఆర్లకు నేను సవాల్ చేస్తున్నా.. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలో వర్షం పడితే, రోజులు తరబడి గల్లీల్లో తిరగలేని పరిస్థితి ఉంది’’ అని మండిపడ్డారు. కేసీఆర్కు ఊడిగం చేసినోడు ఎమ్మెల్సీగా ఉన్నాడని.. ప్రధాని నరేంద్ర మోడీ, బండి సంజయ్, బీజేపీపై విమర్శలు చేయడం తప్ప, వాళ్లకు ఏమీ తెలియదని విమర్శలు గుప్పించారు. ఇంకోసారి బీజేపీ నాయకులపై విమర్శలు చేస్తే.. తాట తీస్తానంటూ వివేకానంద్ని హెచ్చరించారు.
ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటున్నారని.. 168 సర్వే నెంబర్లో పేదలకు ఇంతవరకూ రిజిస్ట్రేషన్ చేయించలేదని కూనం శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్టలో బస్ డిపో కట్టిస్తానని హామీ ఇచ్చి.. ఐదేళ్లు గడిచినా దాన్ని కట్టలేదని అన్నారు. సిగ్గు, లజ్జా ఉంటే.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్ని గాల్లో కలిసిపోయాయని చెప్పారు. కుత్బుల్లాపూర్ ప్రాంత వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని, ఈ ప్రాంత సమస్యలపై తాను బండి సంజయ్కి వివరించానని పేర్కొన్నారు. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రపై కూడా కౌంటర్లు వేశారు. కాంగ్రెస్ చేయాల్సింది జోడో యాత్ర కాదు.. ఛోడో యాత్ర అంటూ కూన శ్రీశైలం గౌడ్ సెటైర్లు వేశారు.
Also Read
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
తాజావార్తలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్పింగ్ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!