KTR : తిరుపతిరెడ్డికి అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు
- వచ్చే ఎన్నికల్లో కొడంగల్లో రేవంత్రెడ్డి పోటీ చేయరు
- రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే, కొడంగల్కు సీఎం తిరుపతిరెడ్డి
- వార్డు మెంబర్ కూడా కానీ తిరుపతిరెడ్డికి అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ నాయకుల జాయినింగ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ ప్రజల జోష్ చూస్తుంటే మామూలుగా లేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కానీ, కొడంగల్కు సీఎం తిరుపతి రెడ్డి అని ఆయన సెటైర్ వేశారు. ఒక వార్డు మెంబర్, ఒక కౌన్సిలర్ కూడా కాని ఆయనకు అధికారులు వంగి వంగి దండం పెడుతున్నారు అని ఎద్దేవా చేశారు.
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
కొడంగల్ భూములను తొండలు గుడ్లు పెట్టని భూములు అని రేవంత్ రెడ్డి అన్నాడని, అలాంటి మాటలు మాట్లాడిన ఆయనకు ప్రజలు సరైన సమాధానం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని గుర్తు చేస్తూ, “ఇక్కడ మీరు ఒక్క ఎంపీటీసీ కూడా గెలిపించకపోతే ఢిల్లీ లెవల్లో తెలుస్తుంది” అన్నారు. అంతేకాకుండా.. “మనమే కట్టిన ప్రాజెక్టులు, మనమే చేసిన అభివృద్ధి పనులను ప్రారంభించడానికి రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ మనకు చాలా బాకీ పడింది. ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డు చూపించండి, వారి మోసాన్ని తిరిగి చూపించండి” అని అన్నారు.
హైదరాబాద్లో ఇటీవల జరిగిన వరదలపై కూడా కేటీఆర్ ఆరోపణలు చేశారు. “హైదరాబాద్లో భారీ వర్షం వచ్చినా ఏమి కాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను పూర్వం కట్టారు. వాతావరణ శాఖ క్లౌడ్బరస్ట్ హెచ్చరించినా ఆ రెండు చెరువులను నింపి ఉంచారు. కావాలనే ఒక్కసారిగా నీటిని వదిలి నగరాన్ని ముంచేశారు. మూసీ పక్కన ఉన్న వారిని ఖాళీ చేయించేందుకే ఈ ప్లాన్ చేశారు. మూసీ ప్రాజెక్టు కోసమే నీళ్లు వదిలారు” అని కేటీఆర్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!