KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- కరీంనగర్లో కేటీఆర్ హాట్ కామెంట్స్
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Slams Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో యువత పాత్ర కీలకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ అంటే కదన, కొదమ సింహాల గడ్డ అని వ్యాఖ్యానించిన ఆయన.. యువతతో పెట్టుకోవద్దని, రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ యువతను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. యువత తలచుకుంటే తమ భవిష్యత్తును తారుమారు చేయగల శక్తి ఉందని అన్నారు.
‘యువతను తక్కువ అంచనా వేయొద్దు’
యువతకు స్కిల్ లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయన అదృష్టవశాత్తూ ముఖ్యమంత్రి అయ్యారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన యువతకు రేవంత్ రెడ్డి పెద్ద లెక్క కాదని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశిస్తూ కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read
- CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
- Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
- Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ అన్యాయం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా ఆలస్యం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. తెలంగాణ ఇస్తామని హామీలు ఇచ్చి చివరకు అనేక మంది యువకుల ఆత్మబలిదానాలకు కాంగ్రెస్ కారణమైందని విమర్శించారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల సమస్యలను పట్టించుకోని పార్టీ ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు.
‘జాబులు లేవు.. జవాబులు లేవు’
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, వారి సమస్యలకు సమాధానాలు కూడా లేవని కేటీఆర్ విమర్శించారు. నోటిఫికేషన్లు రావడం లేదని, కానీ లూటిఫికేషన్లు మాత్రం భారీగా జరుగుతున్నాయని ఆరోపించారు. నిరుద్యోగులపై ప్రేమ చూపిస్తూ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటిని అమలు చేయకుండా కాలం గడుపుతోందని అన్నారు. వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి, ఇప్పుడు వెయ్యి రోజులు దాటుతున్నా హామీలు అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు.
విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిలదీస్తామని చెప్పారు. పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్థులు, నిరుద్యోగులు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.
‘ఎవరు రాజీనామా చేయాలి?’
హామీల అమలుపై కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజీనామా చేయాల్సింది కేసీఆర్నా? లేక 420 హామీలను నెరవేర్చని రేవంత్ రెడ్డినా? అని ప్రశ్నించారు. కేసీఆర్తో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి ఏ గతి పడుతుందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
భూముల అంశంపైనా విమర్శలు
కోట్ల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని కేటీఆర్ ఆరోపించారు. ఇదే విధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని కూడా రాజకీయంగా నిషేధించే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. తమకు ఓట్లు వేసిన నిరుద్యోగులే భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ హామీల అమలుపై సమాధానం చెప్పడం లేదని విమర్శించారు.
పాలిటెక్నిక్ భూములపై ఆరోపణలు
పాలిటెక్నిక్ సంస్థలకు సంబంధించిన భూముల విషయంలో రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా భూములపై దృష్టి పెట్టడం సరికాదని అన్నారు. హామీలపై ప్రశ్నించే వారిని బెదిరించడం ముఖ్యమంత్రికి తగదని విమర్శిస్తూ.. ముఖ్యమంత్రి రౌడీషీటర్లా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు.
‘రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు’
రాబోయే రోజుల్లో రాజకీయ పరిస్థితులు మారుతాయని కేటీఆర్ అన్నారు. రెండేళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. పదవీ విరమణ చేసినా తమ పోరాటం ఆగదని, ప్రజల సమస్యల కోసం పోరాడుతామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థులు, నిరుద్యోగులు, యువత తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
-
Operation Ganga: మోహన్లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న ‘ఆపరేషన్ గంగా’
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!