BRS KTR: రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి భాద్యులపై చర్యలు తీసుకోండి రైతులను బలి చేయొద్దని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ రామారావు మండిపడ్డారు. బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. వాస్తవాలు చెప్పడానికే మా ఈ చలో మెడిగడ్డ పర్యటన అని తెలిపారు. రైతు ప్రయోజనం ముఖ్యం కాదు రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీకి కావాలన్నారు. ఇవాలా చేస్తున్న మొదటి పర్యటన మాత్రమే.. తర్వాత అన్ని ప్రాజెక్టు లు పర్యటిస్తామన్నారు. రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి? భాద్యులపై చర్యలు తీసుకోండి.. రైతులను బలి చేయొద్దని కేటీఆర్ అన్నారు. రిపేర్ చేయకుండా ఉంటే వర్ష కాలంలో వరదలు వస్తే బ్యారేజ్ కొట్టుకుపోవాలని చూస్తున్నారని తెలిపారు.
Read also: Nepal : నేపాల్లో కుప్పకూలనున్న ప్రభుత్వం ?
ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 5 వందలు 6 వందలు మీటర్ల లోతునుంచి నీళ్లను లిఫ్ట్ చేసే గొప్ప కార్యక్రమం అన్నారు. భీమా, నేటం పాడు ప్రాజెక్టు లు పూర్తి చేసి వలసలు ఆపేసినామని అన్నారు. 86 పిలర్లలో 3 పిలర్లు కుంగినై దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులో కూడా సంకేతిక లోపాలు ఉంటాయి సరిదిద్దుకోవాలన్నారు. కాళేశ్వరంలో మొత్తం 196 స్కీం ఉన్నాయి.. మూడు పిలర్లు కుంగితే భూతద్దంలో పెట్టి చూస్తున్నారని తెలిపారు. కల్వకుర్తి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉన్న మేం ఎన్నడు అవమానించలేదని అన్నారు.
కడియం ప్రాజెక్టు రెండు మార్లు తెగింది, అలా అని ఇప్పుడు మెడిగడ్డ కేవలం కుంగింది తెగలేదన్నారు. రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడపడానికి రైతులను ఫణంగా పెట్టకండరి తెలిపారు. రైతు ప్రయోజనాలకు అడ్డు పడొద్దని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. వచ్చే వర్ష కాలం కల్లా సుందిళ్ళ ,అన్నారం, ఎల్లంపల్లి, కొండపోచమ్మ,మల్లన్న సాగర్లో నీటిని నింపాలని కోరారు. రైతులను ఇబ్బంది పెడితే నష్టం మీకే అన్నారు. గతం లో 40 ఏండ్లు అయిన ఒక్కో దగ్గర ప్రాజెక్టు లు పూర్తి కాలేదు కానీ మన కాళేశ్వరం మూడు ఏండ్ల లో పూర్తి చేసినామని తెలిపారు. రైతు బంధు గతి లేదు ఇప్పటికి మూడు సార్లు పెండింగ్ లో పెట్టారని తెలిపారు.
Fake Currency in Medaram: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ నకిలీ కరెన్సీనోట్లు