BRS KTR: కష్ట కాలంలో కేకే, కడియం పార్టీ వదిలి వెళుతున్నారు..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS KTR: కేకే, కడియం ఇలాంటి నాయకులు పార్టీ కష్ట కాలంలో వదిలిపెట్టి వెళ్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పోయే నాయకులు వెళ్లేటప్పుడు కొన్ని రాళ్లు వేసి వెళ్తారు… వాళ్ళు చేస్తున్న విమర్శలపైన వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను… కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని అన్నారు. ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా… పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్తా అన్నారు. ఇన్ని రోజులు పార్టీ కోసం, నాయకుల కోసం పనిచేసిన కార్యకర్తల కోసం నేను స్వయంగా వస్తా.. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలిపించుకుంటా అని హమీ ఇచ్చిన కేటీఆర్ అన్నారు. రంజిత్ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారన్నారు.
Read also: Komati Reddy: బీఆర్ఎస్ దుకాణం బంద్.. 8 మంది బీజేపీ నుంచి వస్తారు..!
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
2014లో విశ్వేశ్వర్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎంపీగా చేసినం… 2019లో రంజిత్ రెడ్డి మాధురి పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరితే చేవెళ్ల ప్రజల చైతన్యంతో ఓడిపోయినారని తెలిపారు. కేసీఆర్ కూతురు అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్లోకి పోయిన రంజిత్ రెడ్డి… పట్నం మహేందర్ రెడ్డిల పైన మన పార్టీ కార్యకర్తలు పగ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే మహేందర్రెడ్డి, రంజిత్ రెడ్డిలు మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయమన్నారు. మల్కాజిగిరిలో పోటీ చేయాలని సీఎం కే విసిరిన సవాలు రేవంత్ రెడ్డి స్పందించలేదన్నారు. ఆయన సొంత సిట్టింగ్ ఎంపి స్థానంలోనే పోటీకి వెనకంజ వేసిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సీట్లను గెలిపిస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
Read also: Komati Reddy: పెద్ద సినిమాలు.. థియేటర్ ల దోపిడీ.. కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
రేవంత్ రెడ్డి లీకువీరుడుగా మారిండు… ఎన్నికల హమీలపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ డ్రామాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేవారు. రైతులకు రుణమాఫీ, 4000 పించన్లు, 2500 మహిళలకు, అందరికీ ఉచిత కరెంటు ఇలాంటి అన్ని హమీలు తుంగలో తొక్కిన్రు అంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారఢీలు మిగిలినవి.. రాష్ట్రంలో ఏవర్గం ఈ రోజు కాంగ్రెస్ పాలనలో సంతోషంగా ఉన్నారో చెప్పాలి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇయ్యాలని డిమాండ్ చేశారు. రేవంత్ 5 ఏండ్లు ప్రభుత్వంలో ఉండు.. నీ 420 హమీలు నేరవేర్చు… నీకు నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవబాంబులు అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ బీ-టీమ్ అన్నారు.
Read also:Malothu Kavitha: నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాలోత్ కవిత
కానీ ఎన్నికల తర్వతా రేవంత్ రెడ్డి బీజేపీ బీ-టీమ్ గా మారిండని అన్నారు. రేవంత్ రెడ్డి.. రాహుల్ రెడ్డికోసం పనిచేస్తున్నారా… లేదా మోడీ కోసమా చెప్పాలన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్ల కన్నా ఎక్కువ వచ్చే పరిస్ధితి లేదు… బిజెపిన అపేందుకు బలమైన స్ధానిక నేతలే అని గుర్తుంచుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే, అది బిజెపికి లాభం అవుతుందన్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు… పార్టీకి అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని తెలిపారు.
Read also:BRS Party: హస్తం గూటికి కడియం.. కాంగ్రెసోళ్లు జర జాగ్రత్త
ఆయన కేవలం రంగారెడ్డి మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితుడుజజ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ముఖ్యంగా ముదిరాజులకు అనేక సేవలు చేసిన నాయకుడు జ్ఞానేశ్వర్ అన్నారు. చేవెళ్లలో నిలబడ్డది కాసానికి జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ గారు అన్నట్టుగానే పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక కేసీఆర్ బలోపేతం చేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో బిసిలకు అత్యధిక స్ధానాలు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. 13 తేదిన జరిగే చెవెళ్ల పార్లమెంట్ మీటింగ్ కు ప్రతి ఒక్కరు తరలిరావాలని పిలుపు నిచ్చారు.
K. Keshava Rao: సీఎం రేవంత్ రెడ్డి తో ముగిసిన కేకే భేటీ..
తాజావార్తలు
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
-
BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
-
IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!