Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ హామీలన్ని అమలు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy Interesting Comments: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్తో పాటు ఇచ్చిన ఇతర హామీలన్నింటినీ అమలు చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ దగ్గర తన అనుచరులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. నల్గొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు తన చిరకాల స్వప్నమని తెలిపారు. ఆలస్యంగానైనా ప్రాజెక్టు పనులు పూర్తిచేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా 10% పనులు మిగిలున్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాజకీయ భిక్ష పెట్టిన తన ప్రాంత ప్రజల రుణాన్ని తాను తీర్చుకున్నానని అన్నారు. ఈసారి తెలంగాణలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నెలలో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీని తీసుకువస్తామని తెలిపారు.
UPSC CSE 2022: సివిల్స్ 2022 ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు తేజాలు
Also Read
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వేడుకల సందర్భంగానే సీఎం పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేడుకలకి విచ్చేసిన ప్రజలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయగా.. తనని సీఎం అనొద్దని అన్నారు. తాను మంత్రి పదవినే వదిలేశానని, తనకు పదవి కాదు ప్రజలే ముఖ్యమని తెలిపారు. తనకు సీఎం పదవి అవసరం లేదన్న ఆయన.. ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని పేర్కొన్నారు. తాను ఏరోజూ పదవుల కోసం ఆశపడలేదని.. పదవులే తనను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. తాను సీఎం పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. మీకోసం (నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశిస్తూ) చావడానికైనా, చంపడానికైనా తాను సిద్ధమేనని.. ఐదు సార్లు గెలిపించిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం ఎవరన్న అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. కాగా.. గతంలో ఓసారి దళిత అభ్యర్థినే సీఎం చేయాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక మలుపు
తాజావార్తలు
-
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
-
Karnataka: కేరళం ముగిసింది.. నెక్ట్స్ కర్ణాటకనేనా? ఈసారి ఢీ అంటే ఢీ తప్పదా?
-
NIMS : నిమ్స్లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..