Komatireddy Venkat Reddy: సీఎం స్పందించకపోతే.. రక్తపాతం తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy Gives Serious Warning To CM KCR: నల్లగొండ జిల్లాలోని సమస్యలపై సీఎం స్పందించకపోతే.. రక్తపాతం తప్పదంటూ ఎంపీ కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా ప్రజలను, ముఖ్యంగా రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. ఎస్ఎల్బీసీకి కేటాయించిన నీటిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. 246 జీవోను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు అవుతోన్నా.. ఎల్ఎల్బీసీకి సంబంధించిన డీపీఆర్ను సమర్పించలేదన్నారు. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా.. లక్షలు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మాణాన్ని పూర్తి చేశారని మండిపడ్డారు.
కృష్ణా నది నుండి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజుకు 8 నుండి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని కోమటిరెడ్డి ఆరోపణలు చేశారు. ఏపీ నీటి దోపిడీని అడ్డుకోకపోతే.. నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బీసీ నిరుపయోగంగా మారుతుందన్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతులకు అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్ నోరుమీదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్ను తమ కాంగ్రెస్ పార్టీ రూపు మాపిందని.. మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రాజెక్ట్లపై, రైతు సమస్యలపై, కరెంట్పై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఉత్తర తెలంగాణ కాలువల నిర్వహణపై ఉన్న శ్రద్ధ.. దక్షిణ తెలంగాణలో ఏమాత్రం లేదని దుయ్యబట్టారు. జిల్లా రైతుల కోసం తాను దీక్ష చేపడతానని.. అది ఆమరణ దీక్షా లేక నిరవధిక దీక్షా అనేది వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి చెప్పారు.
Also Read
- Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం..
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
సాగునీటి కోసం మండలి ఛైర్మన్ ఎందుకు నోరు మెదపడం లేదని కోమటిరెడ్డి ప్రశనించారు. కృష్ణా నది కేటాయంపులను వాడుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదని సెటైర్లు వేశారు. తాను త్వరలోనే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకుంటానని, ఆయనతో అన్ని విషయాలూ చర్చిస్తానని అన్నారు. ఒకవేళ ఆయన నుంచి సరైన స్పందన లేకపోతే.. ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు.. సీఎం స్పందిచకపోతే రక్తపాతం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు.
తాజావార్తలు
-
Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
-
Venky Anil 5: 40 ఏళ్ల కెరీర్లో వెంకీ మామ కొత్త అవతార్.. లెఫ్టినెంట్ కల్నల్గా అదరగొట్టేశాడు!
-
August 15 History: ఆగస్టు 15.. భారత్కే కాదు ఈ 3 సరిహద్దు దేశాల చరిత్రలోనూ కీలక రోజే!
-
Modi-Rahman: బ్రిక్స్కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
-
Tirupati: జాతర వేళ తీవ్ర విషాదం.. బ్యానర్ కడుతుండగా విద్యుత్ షాక్.. స్పాట్లో ఇద్దరు మృతి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!