Kishan Reddy : గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్నదే రేవంత్ రెడ్డి లక్ష్యం
- గాంధీ కుటుంబం అనుగ్రహం పొందడమే రేవంత్ లక్ష్యం
- బీసీలపై చిత్తశుద్ధి లేకుండా డ్రామాలు
- బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు ప్రాధాన్యం కాంగ్రెస్ లక్ష్యం
- బీసీలకు అన్యాయం చేసినది గాంధీ కుటుంబమే : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన జంతర్ మంతర్ సభపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సభ బీసీల సమస్యలకన్నా గాంధీ కుటుంబాన్ని పొగడటానికే పరిమితమైందని ఆయన వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ ఒత్తిడిని తట్టుకునేందుకు, గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతోనే రేవంత్ ఢిల్లీ సభ పెట్టుకున్నాడు. 31 నిమిషాల ప్రసంగంలో సగానికి పైగా రాహుల్, సోనియా పేర్లే జపించాడు” అని విమర్శించారు. “బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిన అంశాలు 18 నెలలుగా ఎందుకు అమలు కాలేదు? బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేదు. రజకులు, గౌడ్లతో పాటు అన్ని వర్గాలను మోసం చేశారు,” అని అన్నారు.
Perni Nani: ఇల్లు అలకగానే పండగ కాదు..! రేపు జగన్ వస్తే మీకు ఏ ఖర్మ పడుతుందో ఆలోచించుకోండి..!
Also Read
- Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
- Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
“జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల సీట్లలో ముస్లింలు గెలిచిన పరిస్థితి గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు అధికారికంగా 10% ముస్లింలను బీసీల్లో చేర్చి 42% రిజర్వేషన్లు అమలు చేస్తే, బీసీలకు నష్టం తప్పదని తెలంగాణ సమాజం గ్రహిస్తోంది. అశాస్త్రీయ సర్వేతో బీసీల సంఖ్య తగ్గించి, ముస్లింలను చేర్చి మోసం చేస్తున్నారు,” అని కిషన్ రెడ్డి ఆరోపించారు. “1955లో కాకా కాలేల్కర్ కమిషన్ను నెహ్రూ పక్కన పెట్టాడు. ఇందిరా, రాజీవ్ గాంధీలు మండల్ కమిషన్ను విస్మరించారు. ప్రతి సందర్భంలోనూ నెహ్రూ కుటుంబం బీసీలకు అన్యాయం చేసింది. ఇప్పుడు అదే క్రమాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోంది,” అని విమర్శించారు. కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, వరుస ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోతోందని కిషన్ రెడ్డి అన్నారు. “నరేంద్రమోదీ గారిని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేయడమే. మోదీ నేతృత్వంలో సుస్థిరమైన పాలన అందుతోంది. వచ్చే 30 ఏళ్లలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారం గురించి ఆలోచించడం మానేయాలి,” అని ఆయన స్పష్టం చేశారు.
KA Paul Warns Vijay: విజయ్ దేవర కొండకు కేఏపాల్ స్ట్రాంగ్ వార్నింగ్.. 24 గంటలు డెడ్లైన్..!
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!