Kishan Reddy: బీజేపీ కి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: Kishan Reddy: బీజేపీ కి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదని.. కవిత అరెస్టు పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూతురు నేడూ ఈడీ ముందు విచారణ ఎదుర్కొంటుందని అన్నారు. బీజేపీ కి కవిత అరెస్టు కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం లో జరిగిన అవినీతి అన్నారు. తెలంగాణా ప్రజలకు ఆదాయం తెచ్చేందుకు కవిత ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం చేశారా? అని ప్రశ్నించారు. ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం పై విచారణ చేస్తే కవిత పేరు వచ్చిందన్నారు. కవిత అరెస్టు అయితే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేసేస్తున్నారు? అని ప్రశ్నించారు. గతం లో మధ్య నిషేధం చేస్తాం అని చెప్పి ఢిల్లీ లో లిక్కర్ వ్యాపారం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యం అమ్మకాలతో పేదల రక్తం తాగుతోందని తెలిపారు. బీనామీ పేర్లతో వ్యాపారం చేశారు, ఆధారాలను ధ్వంసం చేసి బీజేపీ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read also: Revanth Reddy: ఇన్నాళ్లు సీఎంగా చూశారు.. ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్ గా నేనేంటో చూస్తారు..!
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
అవినీతి కి పాల్పడితే బీజేపీ కార్యకర్తలు అయిన విపక్షాల నేతలైనా విచారణ ఎదుర్కోవాలని తెలిపారు. కవిత అనుచరులు, బినామీలను విచారిస్తే కవిత పాత్ర ఉందని తేలిందని క్లారిటీ ఇచ్చారు. విచారణ కు పిలిస్తే సహకరించకుండా మొండికేసిందని అన్నారు. అందుకే ఇప్పుడు అరెస్టు అయ్యిందని తెలిపారు. ఇది బీరు, బ్రాందీ కేసు, ఢిల్లీ ప్రభుత్వం కేసుని క్లారిటీ ఇచ్చారు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ పట్ల సానుకూలం వాతావరణం దేశవ్యాప్తంగా నెలకొందని..మూడోసారి 370స్థానాలు బీజేపీ కి ఒంటరిగా రావాలని, ఎన్డీయే భాగస్వామ్య పార్టీ లతో కలిసి 400 స్థానాల్లో గెలుపొందుతామన్నారు. దేశం లో అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పదేళ్లలో కాంగ్రెస్ హయాంలో 22లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఏం విపక్షం కూడా మోడీ ప్రభుత్వం అవినీతి చేసిందని విమర్శించే అవకాశం లేకుండా చేశామన్నారు. రేపు ఉదయం జగిత్యాలలో జరిగే సభలో మోడీ పాల్గొంటారని తెలిపారు. ఉత్తరాదిన బీజేపీ కి ఘననీయమైన సీట్లు వస్తాయని తెలిపారు.
Read also: Etela Rajender: ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.. రేవంత్ ఖబర్దార్..!
చాలామంది ఐఏఎస్ లు బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఏ ఒక్కరిని అడిగినా మోడీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందన్నారు. లక్షలాది ఉద్యమకారులు పోరాటం చేస్తే రాష్ట్రం ఓ కుటుంబం చేతిలో నలిగి పోయిందని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలన చేశారు కాబట్టి వారిని ప్రజలు ఓడించారన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని చెప్పింది..అవినీతి పై ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదు? అని ప్రశ్నించారు. గతం లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం కు సీబీఐ విచారణ జరిపించాలి అని లేఖ రాసిందన్నారు. వందరోజులు పూర్తి చేసుకున్నా ఎందుకు సీబీఐ విచారణ కు లేఖ రాలేదు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పథకాలకు ప్రచారం చేసేందుకు పెట్టిన ఖర్చు కూడా పథకం అమలు కు చేరలేదన్నారు. చదువు కున్న వారు, మేధావులు బీజేపీ లో చేయమని పిలుపునిస్తున్నా అన్నారు. ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద పార్టీ అని తెలిపారు.
Praneethrao Phone Tapping case: పంజాగుట్ట పోలీసుల కస్టడీలో ప్రణీత్ రావు..
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?