Kishan Reddy: పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే అధికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: పెట్రోల్, డీజిల్ ధరలపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలో అధికంగా ఉందని తెలిపారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ అత్యధిక ధరలతో.. ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో 13 రూపాయలు ఎక్కువగా ఉందని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ పైఅత్యధిక వ్యాట్ తెలంగాణలో విధిస్తున్నారని అన్నారు. ఆర్ధిక మాంద్యం వల్ల ప్రపంచంలో పెట్రోల్ ధరలు పెరిగాయని అన్నారు. ప్రజలకు భారం పడొద్దని వ్యాట్ తగ్గించాలని కేంద్రం ప్రయత్నం చేసిందని గుర్తుచేశారు. దేశంలో 23 రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయని, 69,190 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణకు వచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెట్రోల్ పై తెలంగాణ కు ఏడాదికి 4,527 కోట్ల ఆదాయం ఉండగా.. ఇప్పుడు మూడు రెట్లు పెరిగి 13170 కోట్ల ఆదాయం వస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా తగ్గించలేదని అన్నారు. అదనపు భారం పడుతున్నా కేంద్రం పన్నులు పెంచటం లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు నిధులు మల్లిస్తున్నారని ఆరోపిస్తారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
Read also: KTR: కామారెడ్డి ఇష్యూ పై స్పందించిన కేటీఆర్.. అభ్యంతరాలు వుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
గ్రామ పంచాయితీల్లో అభివృద్ధి కోసం ఆర్థిక సంఘం సిపారస్ మేరకు నిధులు విడుదల చేసిందని అన్నారు. పంచాయితీల్లో త్రాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం, సిబ్బంది జీతాలు.. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను గద్దల్లా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. బ్యాంకుల్లో పడ్డ డబ్బుల్ని గంటలోనే దారి మళ్లించారని ఆరోపించారు. డబ్బులు పడ్డ మెసేజ్ చూసి సర్పంచులు బ్యాంకులకు వెళ్తే అప్పటికే దారి మళ్లించారని అన్నారు. సర్పంచులకు తెలియకుండా డిజిటల్ కీ ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఉపాధి హామీ పథకంలోనూ నిధులు దారి మళ్లించారని ఆరోపణలు గుప్పించారు. కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సర్పంచులు నిరసన కోసం కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ తీరు ఏ రకంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా వంట నూనెల కోసం ప్రత్యేక పథకం రూపొందించారని అన్నారు. ఆయిల్ ఉత్పత్తులను పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకొందని తెలిపారు. 2025 నాటికి 12 లక్షల టన్నులు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్ కోసం తెలంగాణ కు 114 కోట్ల రూపాయలు నిధులు కేంద్రం చెల్లించిందని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి చెప్పింది అబద్ధం, మాకు ఒక్క రూపాయి రాలేదని వక్ర భాష్యం చెప్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
Hardik Pandya: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన హార్దిక్.. భారత క్రికెట్ చరిత్రలో తొలి కెప్టెన్
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?