Kishan Reddy: అభివృద్ధి అంటే హైటెక్ సిటీ ఒక్కటేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy Fires On TRS Government: అభివృద్ధి అంటే కేవలం హైటైక్ సిటీ ఒక్కటేనా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన ఆయన.. అభివృద్ధి అంటే రాష్ట్ర ప్రభుత్వం హైటైక్ సిటీ వైపు చూస్తోందని.. కానీ ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్తో పాటు పలు డివిజన్లలోని ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. బస్తీల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారని.. రోడ్లు సరిగా లేక మురుగునీరు పారుతూ జనం అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. అయినా.. వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేవలం హైటెక్ సిటీ మీదే దృష్టి పెట్టిందని ఆగ్రహించారు. తన పాదయాత్రలో భాగంగా డివిజన్లలోని ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఆయన.. ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని స్పష్టం చేశారు.
Kapu Reservations: ఏపీలో కాపులకు 5 శాతం రిజర్వేషన్.. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
అంతకుముందు హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని ఆసిఫ్ నగర్, మల్లేపల్లి డివిజన్లలో పాదయాత్ర చేసిన కిషన్ రెడ్డి.. వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. డివిజన్లో నెలకొన్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన.. డివిజన్లో స్ట్రీట్ లైట్లు లేకపోవడం, రోడ్లలో గుంతలు ఉండటం మీద అధికారులపై ఫైర్ అయ్యారు. ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం బస్తీలను పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఇంత దారుణంగా ఉందని.. వీధిలైట్లకు నిధులు కేటాయించని పరిస్థితి నెలకొందని అన్నారు.
Omicron BF.7: చైనాలో కొత్త వేరియంట్ కల్లోలం.. భారత్లోకి ప్రవేశం
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!