Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వడ్ల రాజకీయం దుమారాన్ని రేపుతోంది. 13న రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ పంపుతామని, కేంద్రం తీసుకోవాలని కోరారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం బియ్యం తీసుకోవటం కోసం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ రాష్ట్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రప్రభుత్వం ఘర్షణాత్మకమయిన వైఖరితో, విమర్శలు చేసింది.
రాష్ట్రం ఆలస్యం చెయ్యటం వల్ల రైతులు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవాల్సి వచ్చింది.తమ రాజకీయ స్వలాభమ్ కోసం, రైతుల జీవితాలతో చెలగాటం ఆడారు. ఉప్పుడు బియ్యం పై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రం అంగీకారాన్ని తెలిపిందన్నారు. వడ్ల కొనుగోలు కోసం ఏ రకమయిన ఏర్పాట్లు చెయ్యలేదన్నారు. వడ్ల కొనుగోలు విషయంలో బాధ్యతారహితంగా రాష్ట్ర సర్కార్ వ్యవహరించింది.
Also Read
గత ఖరీఫ్, రబీ సీజన్ల బియ్యాన్ని ఇప్పటికి ఇవ్వలేదు. తెలంగాణలో 15 కోట్ల గోనె సంచులు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద కోటి సంచులు కూడా లేవు. కేసీఆర్, కేటీఆర్ లు తట్టల్లో బియ్యం మోస్తారా? హుజురాబాద్ లో బీజేపీ గెలిచాక రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చింది. యుద్ధప్రాతిపదికన రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చెయ్యాలి. నూకల నుంచి బయో ఫ్యుయల్ తయారు చేయొచ్చు.. అందుకోసం బయో ఫ్యూయల్ తయారీ కోసం బోర్డ్స్ ఏర్పాటు చెయ్యాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
రైస్ మిల్స్ లో ఎంత బియ్యం నిల్వ ఉండాలో ఉండటం లేదు. తెలంగాణ లో అన్ని రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చెయ్యాలని అధికారులను అదేశించాం. రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లపై ఎటువంటి చర్యలు తీసుకుందో చెప్పాలి. 40 రైస్ మిల్స్ తనిఖీ చేస్తే 4,53,896 బస్తాల బియ్యం తక్కువ ఉంది. సీబీఐ దర్యాప్తు కోసం ఓ నాయకుడు లేఖ రాశారు. వాస్తవానికి రైస్ మిల్లులపై కేంద్రానికి అధికారం లేదు. ఇంతకూ ఆ బియ్యం ఏమయ్యాయో స్పష్టత కావాలన్నారు. రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం.
రైతుల విషయంలో కేసీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఎన్నో రాష్ట్రాల్లో రైతులు మాకు మద్దతుగా ఉన్నారు. ప్రయివేట్ వాళ్ళు బియ్యాన్ని ఎగుమతి చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు ఆర్ధిక సాయం చెయ్యాలి. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు, ఉద్యోగులకు, ప్రజలకు ఆర్ధిక సాయం చెయ్యాలి. జీహెచ్ఎంసీలో ఉద్యోగులకు ఇప్పటికి జీతాలు ఇవ్వలేదు. రాష్ట్రాన్నీ రావణకాష్టం చేస్తున్నారు. రాజకీయం చేయాలనుకుంటే చాలా అంశాలున్నాయి. కమిషన్ల కోసం అప్పులు తీసుకుంటున్నారన్నారు కిషన్ రెడ్డి.
Read Also: Jagga Reddy: టీఆర్ఎస్, బీజేపీది మైండ్ గేమ్.. 12 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్కి గిఫ్ట్ ఇవ్వాలి..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!