Kishan Reddy: వేల కేసీఆర్లు వచ్చినా.. మోడీని అడ్డుకోలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy Fires On CM KCR Over Flexis Against PM Modi: తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి వాళ్లు వెయ్యి మంది వచ్చినా సరే.. ప్రధాని మోడీని అడ్డుకోలేరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రధాని మోడీ పర్యటనకు వ్యతిరేకంగా తెలంగాణలో వెలసిన బ్యానర్లను ఉద్దేశించి.. బేగంపేట్లో నిర్వహించిన బీజేపీ సభలో కిషన్ రెడ్డి ఆ విధంగా వ్యాఖ్యానించారు. రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టి, ఏం సాధించాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. కిరాయి మనుషులతో బ్యానర్లు కట్టి, మోడీని అడ్డుకోలేరన్నారు. ప్రధాని మోడీ మళ్లీ మళ్లీ తెలంగాణకు వస్తారని చెప్పారు.
రాష్ట్ర అధినేతగా ప్రధానిని స్వాగతం పలకాల్సింది పోయి.. ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తాము చూస్తున్నామని, ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసే నియంతృత్వ పాలన కొనసాగుతోందని కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. సీఎంకి తెలంగాణ అభివృద్ధి పట్టదని, ఆయనకు కేవలం తన కుటుంబమే ముఖ్యమని పేర్కొన్నారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలకు విరుద్ధంగా సీఎం పాలన సాగుతోందన్నారు. ట్రైబల్ మ్యూజియంకి ఇప్పటివరకు కేసీఆర్ భూమి ఇవ్వలేదన్నారు. సైన్స్ సిటీకి కూడా ల్యాండ్ ఇస్తానని హామీ ఇచ్చి, దాన్ని మర్చిపోయారన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశకు సహకరించకుండా అడ్డుకుంటోంది కేసీఆరేనని విమర్శించారు.
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ ప్రధాని అయ్యేదాకా ఎన్ని జాతీయ రహదారులు ఉండేవో.. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమదేళ్లలోనే అందుకు రెట్టింపు రహదారుల్ని నిర్మించడం జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైల్వే వ్యవస్థ కూడా అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఎంత కాలం వరకు అధికారంలో ఉంటారో, అప్పటివరకూ రాష్ట్రానికి నష్టం కలుగుతుందని ఆరోపణలు చేశారు. మహిళ అని చూడకుండా గవర్నర్ని సైతం అవమానిస్తున్నారని మండిపడ్డారు. తాము కల్వకుంట్ల కుటుంబానికి భయపడేదే లేదని, ప్రజల్లోనూ కేసీఆర్ పాలనపై నమ్మకం పోయిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
-
Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
-
Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!