Kishan Reddy: కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన బీజేపీ గెలుపును ఆపలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన బీజేపీ గెలుపును ఆపలేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యిందన్నారు. ఈటెల రాజకీయంగా అనేక ఉద్యమాలు, ఆటుపోట్లు ఎదుర్కున్నారని తెలిపారు. ఎవరు ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నామన్నారు. ధైర్యం, సత్తా కలిగిన నాయకత్వం నరేంద్ర మోడీలో ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలవాలన్నారు. తెలంగాణలో 12కు పైగా స్థానాలను గెలుస్తున్నామని తెలిపారు. బీజేపీకు బీఆర్ఎస్ బీటీం అంటున్నారు.. మేము ఎవరికి బీటీం కాదన్నారు.
Read also: Maoists: రాళ్లు, బ్యానర్ పోస్టర్లు వేసి రోడ్డును దిగ్బంధించిన మావోలు..
Also Read
తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అనేది లేదు.. వాళ్లకి ఒక్క సీట్ రాకపోయిన ఏం లేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేం లేదన్నారు. ప్రమాదవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం.. దీన్ని ఎవరు ఆపలేరన్నారు. ఐక్యమత్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. మల్కాజ్ గిరిలో ఈటెలను గెలిపిద్దామన్నారు. డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయాలని అధిష్టానం చెప్పిందన్నారు. నామినేషన్ తరువాత అందరూ డోర్ టూ డోర్ ప్రచారం చేయాలన్నారు. ఇప్పటి వరకు దేశానికి ఏం చేశాం.. వచ్చే ఐదేళ్లు ఏం చేయబోతున్నాం అనేది వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు మనకు ఢోకా లేదన్నారు.
Read also: Eagle : నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన ఈగల్ తమిళ్ వెర్షన్..
రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియట్లేదన్నారు. కాంగ్రెస్ ఏం హామీలు ఇచ్చిందో కూడా అర్థం కావడం లేదన్నారు. కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో వంశీ తిలక్ ను గెలిపించాలన్నారు. అనేక ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించాడు వంశీ అని తెలిపారు. కంటోన్మెంట్ ఎన్నికలు కూడా మనకు కీలకం.. అసెంబ్లీ సీటును కూడా గెలవాలన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది.. ఈటెల భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన బీజేపీ గెలుపును ఆపలేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనం గెలవడానికి.. లోక్ సభ ఎన్నికలు మొదటి అడుగన్నారు.
Loksabha Election 2024: ఎన్నికల ప్రచారంలో గుండెపోటు.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు!
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
-
Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
-
Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
-
US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!