Kishan Reddy : అన్ని పార్టీల నాయకులు ఒకే దగ్గర కలుసుకునే వేదిక అలయ్ బలయ్
- అలయ్ బలయ్.. రాజకీయ విభేదాలను మించే వేదిక
- సనాతన ధర్మంపై యువతలో పెరుగుతున్న ఆసక్తి
- GST తగ్గించిన మోడీ చారిత్రక నిర్ణయం
- దేశ ఏకతా కోసం అందరం అలయ్ బలయ్ కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దసరా సందర్భంగా నిర్వహించే “అలయ్ బలయ్” కార్యక్రమ ప్రాధాన్యతను గుర్తుచేశారు. విభేదాలు ఉన్న నాయకులు కూడా ఒకే వేదికపై కలుసుకునే ప్రత్యేక వేదిక ఇదేనని ఆయన పేర్కొన్నారు.
Akshay Kumar: నా కూతురు న్యూడ్ పిక్స్ అడిగాడు.. అక్షయ్ కుమార్ సంచలనం
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
“దసరా రోజున మనం ఒకరిని ఒకరు కలుసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం. అదే తరహాలో అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా రాజకీయంగా విభేదించే వ్యక్తులు కూడా ఒకే వేదికపై కలుస్తారు,” అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా దత్తాత్రేయ గారు అలయ్ బలయ్ ద్వారా అందరినీ కలిపారని ఆయన గుర్తుచేశారు. మునుపు దేవాలయాలకు వృద్ధులు మాత్రమే వెళ్తారని, కానీ ఇప్పుడు పాఠశాల విద్యార్థులు కూడా ఆసక్తిగా దేవాలయాలకు వెళ్ళి చదువుకు బయలుదేరుతున్నారని చెప్పారు. సనాతన ధర్మంపై యువతకు ఆసక్తి పెరగడం సంతోషకరమని ఆయన అన్నారు.
ప్రపంచంలో ఎవరూ GST తగ్గించలేదని, కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం పేదలకు ఊరట కలిగించేలా అనేక వస్తువులపై GST తగ్గించారని కిషన్ రెడ్డి తెలిపారు. “ధరలు పెరగడమే తప్ప తగ్గవు అనేది సాధారణ అభిప్రాయం. కానీ మోడీ గారు ధరలు తగ్గించారు. దసరా, దీపావళి పండుగల సమయంలో పేదలకు నిజమైన గిఫ్ట్ ఇచ్చారు,” అని ఆయన అన్నారు. GST ద్వారా మోడీ నిజమైన “అలయ్ బలయ్” ఇచ్చారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రాజకీయ విభేదాలు వేరుగా ఉన్నా, దేశానికి సంబంధించి అందరూ ఒకే దారిలో నడవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. “ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా మనం అలయ్ బలయ్ చేసుకున్నాం. దేశ ఏకతా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరం కలిసికట్టుగా నిలబడాలి. హిందూ మతం లేకుంటే దసరా ఉండదు, దేశ ఏకతా ఉండదు,” అని ఆయన అన్నారు.
Avatar 3: ‘అవతార్: స్నీక్ పీక్తో ‘ది వే ఆఫ్ వాటర్’ రీ-రిలీజ్
తాజావార్తలు
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..